ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మలేషియాలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో ప్రధాని భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 08 FEB 2026 2:50PM by PIB Hyderabad

మలేషియాకు చెందిన నలుగురు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారుపెట్రోనాస్ అధినేతఆ గ్రూప్ సీఈవో తాన్ శ్రీ తెంగ్కు మహమ్మద్ తౌఫిక్బెర్జాయా కార్పొరేషన్ బెర్హాద్ వ్యవస్థాపకుడు తాన్ శ్రీ దాతో సేరి విన్సెంట్ తాన్ చీ యియున్ఖజానా నేషనల్ బెర్హాద్ మేనేజింగ్ డైరెక్టర్ దాతో అమీరుల్ ఫైసల్ వాన్ జహీర్ఫైసన్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థాపకుడు దాతో పువా ఖైన్ సెంగ్‌తో ఆయన భేటీ అయ్యారు.

భారత్మలేషియా మధ్య పెరుగుతున్న వ్యాపార సంబంధాలనూభారత ఆర్థిక వృద్ధి గమనంపై మలేషియా కంపెనీలు చూపుతున్న అమితాసక్తిని ప్రధానమంత్రి అభినందించారువాణిజ్య నిర్వహణను సులభతరం చేయడానికీఅలాగే స్థిరమైనసమర్థమైనపారదర్శకమైన వ్యాపారవిధానపరమైన వాతావరణాన్ని ఏర్పరిచేలా.. కొన్నేళ్లుగా భారత్‌లో చేపట్టిన సంస్కరణలుకార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారుముఖ్యంగా మౌలిక సదుపాయాలుపునరుత్పాదక ఇంధనండిజిటల్ సాంకేతికతసెమీ కండక్టర్లుకృత్రిమ మేధఆరోగ్య రక్షణ వంటి రంగాలలో భారత్ అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని మలేషియా వ్యాపార సంస్థలను ఆయన ప్రోత్సహించారుఈ దిశగా 2026 ఫిబ్రవరి 07న కౌలాలంపూర్‌లో నిర్వహించిన పదో ‘భారత్-మలేషియా సీఈవో ఫోరమ్’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారుభారత్ మలేషియా వాణిజ్యపెట్టుబడి సంబంధాలను ఈ ఫోరంలో జరిగిన చర్చలు మరింత బలోపేతం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వికసిత భారత్ నిర్మాణం దిశగా భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను పారిశ్రామిక ప్రముఖులు ప్రశంసించారువికాసం దిశగా భారత్ గమనంపై విశ్వాసం వ్యక్తం చేశారుపెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను విస్తరించడం ద్వారాభారతీయ భాగస్వాములతో కలిసి ఉమ్మడి వ్యాపారాల్లో పాలుపంచుకోవడం ద్వారా.. భారత్‌లో తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు అమితాసక్తిని వ్యక్తం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2225158) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Assamese , Gujarati , Odia , Tamil , Malayalam