ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఫ్రాన్స్ అధ్యక్షుని దౌత్య సలహాదారు భేటీ
प्रविष्टि तिथि:
13 JAN 2026 10:52PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుని దౌత్య సలహాదారు శ్రీ ఇమ్యాన్యుయెల్ బన్ ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ మాక్రోన్కు దౌత్య సలహాదారైన శ్రీ ఇమ్యాన్యుయెల్ బన్ను కలుసుకోవడం సంతోషదాయకం.
అనేక రంగాల్లో సన్నిహిత సహకారంతో ముందుకు పోతున్న బలమైన, విశ్వసనీయమైన భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇక మీదట కూడా కొనసాగించాలని మేం పునరుద్ఘాటించాం. నవకల్పన, సాంకేతిక విజ్ఞానం, విద్య రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరించడం భారత్-ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరం సందర్భంగా.. సంతోషం కలుగుతోంది. కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా మేం మా అభిప్రాయాల్ని పంచుకున్నాం. అధ్యక్షుడు శ్రీ మాక్రోన్ త్వరలోనే భారత్ పర్యటనకు వస్తారని ఆశిస్తూ, ఆయనకు స్వాగతం పలకడం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’.
***
(रिलीज़ आईडी: 2214999)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam