ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రధానికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
· పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు... ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్ష
· భారత్ - ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఉమ్మడి ప్రాధాన్యాలను గుర్తించిన ఇద్దరు ప్రధానులు
· ఏ రూపంలో ఉన్నా, ఏ రకంగా వ్యక్తమైనా.. ఉగ్రవాదాన్ని సహించబోమని పునరుద్ఘాటన
· గాజా శాంతి ప్రణాళిక అమలుపై భారత ప్రధానికి వివరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
· ఈ ప్రాంతంలో న్యాయబద్ధమైన, శాశ్వత శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు భారత నిరంతర మద్దతును పునరుద్ఘాటించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
07 JAN 2026 3:02PM by PIB Hyderabad
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గౌరవ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ లో సంభాషించారు.
వారిద్దరూ పరస్పరం నూతన సంవత్సర ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. రెండు దేశాల ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, బలమైన పరస్పర విశ్వాసం, భవిష్యత్ దృక్పథాల మార్గనిర్దేశంలో.. ఈ ఏడాది భారత్ – ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఉమ్మడి ప్రాధాన్యాలను వారు గుర్తించారు.
ఏ రూపంలో ఉన్నా, ఏ రకంగా వ్యక్తమైనా ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రధానులిద్దరూ పునరుద్ఘాటించారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
గాజా శాంతి ప్రణాళిక అమలుపై భారత ప్రధానమంత్రి శ్రీ మోదీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు వివరించారు. ఆ ప్రాంతంలో న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చించారు.
సంప్రదింపులను కొనసాగించాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు.
***
(रिलीज़ आईडी: 2212263)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam