ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మృతికి సంతాపం తెలిపిన పీఎం

प्रविष्टि तिथि: 30 DEC 2025 9:53AM by PIB Hyderabad

ఢాఖాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధానిబీఎన్‌పీ ఛైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:

‘‘ఢాకాలో మాజీ ప్రధానమంత్రిబీఎన్‌పీ ఛైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా మృతి చెందారన్న వార్త తీవ్రంగా కలచి వేసింది.

ఆమె కుటుంబానికీబంగ్లాదేశ్ ప్రజలకూ హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నానుఈ దుఃఖాన్ని భరించే ధైర్యాన్ని ఆమె కుటుంబానికి భగవంతుడు ప్రసాదించుగాక!

బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధానమంత్రిగా.. ఆ దేశ అభివృద్ధికిభారత్-బంగ్లా సంబంధాలకు ఆమె అందించిన సహకారం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.

 

ఢాకాలో 2015లో ఆమెతో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటున్నానుమన భాగస్వామ్యానికి ఆమె లక్ష్యంవారసత్వం మార్గనిర్దేశం అందిస్తాయని విశ్వసిస్తున్నా.

ఆమె ఆత్మకు శాంతి చేకూరుగాక!’’

 

***


(रिलीज़ आईडी: 2209700) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam