ప్రధాన మంత్రి కార్యాలయం
నవపారిశ్రామికవేత్తలు, కష్టించి పనిచేసే వారికి అసాధ్యమేదీ లేదని ఉద్బోధిస్తూ.. సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
29 DEC 2025 9:52AM by PIB Hyderabad
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కష్టపడి పనిచేసే వారికి అసాధ్యమంటూ ఏదీ లేదని ఉద్బోధించే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
“నాత్యుచ్ఛశిఖరో మేరుర్నాతినీచం రసాతలం
వ్యవసాయద్వితీయానాం నాత్యపారో మహోదధిః’’
ఏ పర్వతమూ ఎక్కలేనంత ఎత్తయినదీ కాదు, ఏ ప్రదేశం చేరుకోలేనంత లోతైనదీ కాదు అని ఈ సుభాషితం చెబుతోంది. అదేవిధంగా, దాటలేనంత విశాలమైన సముద్రమూ ఏదీ లేదు! నిజానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, కష్టించి పనిచేసేవారికి అసాధ్యమైనది ఏదీ లేదు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“నాత్యుచ్ఛశిఖరో మేరుర్నాతినీచం రసాతలం
వ్యవసాయద్వితీయానాం నాత్యపారో మహోదధిః’’
(రిలీజ్ ఐడి: 2209685)
సందర్శకుల సూచీ సంఖ్య : : 38
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam