రాష్ట్రపతి సచివాలయం
క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
24 DEC 2025 5:12PM by PIB Hyderabad
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పౌరులకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.
ఓ సందేశంలో రాష్ట్రపతి ఇలా పేర్కొన్నారు.
"క్రిస్మస్ సందర్భంగా పౌరులకు, ప్రత్యేకంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆనందం, ఉత్సాహంతో కూడిన క్రిస్మస్.. ప్రేమ, కరుణ సందేశాన్ని చాటిచెబుతుంది. మానవాళి సంక్షేమానికి ఆ ప్రభువు ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుంది. సమాజంలో శాంతి, సామరస్యం, సమానత్వం, సేవా గుణాలను బలపరచాలన్న స్ఫూర్తిని ఈ పవిత్ర సందర్భం సూచిస్తుంది.
ఏసుక్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరిస్తామని, దయాగుణం, సామరస్యాన్ని పెంపొందించే సమాజం కోసం కృషి చేస్తామని మనం ప్రతిజ్ఞ పూనుదాం"
***
(रिलीज़ आईडी: 2208237)
आगंतुक पटल : 5