ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిజమైన ఆనందం స్వావలంబనతోనే లభిస్తుందంటూ ఓ సంస్కృత శ్లోకాన్ని ఉదాహరించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 DEC 2025 8:41AM by PIB Hyderabad

వ్యక్తిగత పురోగతితో పాటు దేశ ప్రగతిలో క్రమశిక్షణస్వావలంబన కీలక పాత్రను పోషిస్తాయని భారతీయ సంస్కృతి చాటిచెబుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.

ఒక సంస్కృత సూక్తిని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉదాహరించారుఇతరులపై ఆధారపడితే కష్టాలు ఎదురవుతాయనీస్వీయ కర్మలను నియంత్రించుకొంటూ ఉంటే ఎప్పటికీ ఆనందంగా ఉండడం సాధ్యపడుతుందనీ ఆ శ్లోకం సూచిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ సంస్కృతంలో ఇలా రాశారు:

‘‘సర్వ పరవశం దుఃఖమ్ సర్వమాత్మావశం సుఖమ్

ఏతద్ విద్వత్ సమాసేన లక్షణం సుఖదు:ఖయో:’’

 

***


(रिलीज़ आईडी: 2204189) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam