కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసుకోవాలన్న నిబంధనను ఉపసంహరించుకున్న ప్రభుత్వం

प्रविष्टि तिथि: 03 DEC 2025 3:00PM by PIB Hyderabad

పౌరులందరికీ సైబర్ భద్రతను కల్పించాలన్న ఉద్దేశంతో అన్ని స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందిఈ యాప్ సురక్షితమైనదిసైబర్ నేరగాళ్లుమోసపూరిత చర్యల నుంచి పౌరులను రక్షించేందుకు రూపొందించింది.

వినియోగదారులకు రక్షణ కల్పిస్తూనేరగాళ్లుమోసపూరిత చర్యల గురించి ఫిర్యాదు చేయటంలో ప్రజల భాగస్వామ్యానికి ఇది సహకరిస్తుందివినియోగదారులను కాపాడటమే ఈ యాప్ పనివినియోగదారులు ఎప్పుడైనా యాప్‌ని ఫోన్ నుంచి తొలగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇప్పటివరకు 1.4 కోట్ల మంది వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారురోజుకు 2,000 నేర సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారువినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోందిఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇతరులకు కూడా యాప్ ని సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలన్న ఆదేశాలు ఇచ్చారుకేవలం నిన్న ఒక్కరోజులోనే లక్షల మంది పౌరులు యాప్ ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు నమోదు చేసుకున్నారుఇది సాధారణం కంటే 10 రెట్లు అధికంతన భద్రతకు ప్రభుత్వం అందించిన ఈ యాప్ పై పౌరులకున్న విశ్వాసాన్ని ఇది స్పష్టం చేస్తుంది.

సంచార్ సాథీకి ఆదరణ పెరుగుతున్నందునమొబైల్ తయారీదారులు ముందుగానే ఆ యాప్ ని ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయాలన్న నిబంధనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం కోసం డీఓటీ హ్యాండిల్స్‌ను అనుసరించండి:

ఎక్స్  https://x.com/DoT_India

ఇన్‌స్టా -https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

ఎఫ్‌బీ  https://www.facebook.com/DoTIndia

యూట్యూబ్ https://www.youtube.com/@departmentoftelecom


(रिलीज़ आईडी: 2198503) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Odia , Tamil , Malayalam