కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సంచార్ సాథీ యాప్ తప్పనిసరన్న అంశంపై అపోహలను తొలగించిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
వినియోగదారులు ఎప్పుడైనా యాప్ ను తొలగించవచ్చు..
స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నప్పుడే యాప్ పని చేస్తుంది: శ్రీ సింధియా
సంచార్ సాథీ... నిఘా వ్యవస్థ కాదు.. ప్రజల భాగస్వామ్యంతో కూడిన రక్షణ సాధనం: శ్రీ సింధియా
प्रविष्टि तिथि:
02 DEC 2025 2:54PM by PIB Hyderabad
సంచార్ సాథీ యాప్ వాడకం తప్పనిసరి అన్న దానిపై కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ స్పష్టతనిచ్చారు. సంచార్ సాథీ యాప్ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధమైనదని, స్వచ్ఛందమైనదని తెలిపారు. ఈ యాప్ ప్రయోజనాలను పొందటానికి వినియోగదారులకు వీలునప్పుడు యాక్టివేట్ చేసుకోవచ్చని, తమ సాధనాల నుంచి ఎప్పుడైనా దాన్ని డీ-యాక్టివేట్ గానీ లేదా తొలగించవచ్చన్నారు.
పౌరులకు ప్రాధాన్యత, గోప్యతకు సురక్షితమైన వేదిక
వినియోగదారుల భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, మొబైల్ వినియోగదారుడి సాధికారతకు సంచార్ సాథీ యాప్ ని రూపొందించినట్లు శ్రీ సింధియా తెలిపారు. "సంచార్ సాథీ యాప్, పోర్టల్ రెండూ.. పారదర్శకమైన, సులభంగా ఉపయోగించగలిగే సాధనాల ద్వారా తమను తాము రక్షించుకునేందుకు వీలు కల్పిస్తాయి. ప్రజల భాగస్వామ్యం దిశగా ఇది కీలక ముందడుగు. డిజిటల్ వ్యవస్థ రక్షణలో భాగంగా పౌరులు క్రియాశీలకంగా ఇందులో పాల్గొంటారు" అని చెప్పారు.
ప్రభావం, సంచార్ సాథీ సాధించిన గణాంకాలు
సంచార్ సాథీ ప్రారంభమైనప్పటి నుంచి వచ్చిన మెరుగైన ఫలితాలు:
-
21.5 కోట్ల మందికి పైగా పోర్టల్ ను సందర్శించారు.
-
1.4 కోట్ల మందికి పైగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు.
-
'నా నంబర్ కాదు' అని ఎంచుకుని 1.43 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లను పౌరులు డిస్ కనెక్ట్ చేశారు.
-
పోగొట్టుకున్న, దొంగిలించిన 26 లక్షల ఫోన్లను గుర్తించి, 7.23 లక్షల ఫోన్లను తిరిగి సంబంధిత వ్యక్తులకు చేరవేశారు.
-
పౌర ఫిర్యాదుల ఆధారంగా 40.96 లక్షల మోసపూరిత కనెక్షన్లను తొలగించారు.
-
మోసపూరిత కార్యకలాపాలతో ముడిపడిన 6.2 లక్షల ఐఎంఈఐ నంబర్లను నిలిపివేశారు.
-
రూ.475 కోట్ల ఆర్థిక నష్టం జరగకుండా ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ) ద్వారా నివారించారు.
సైబర్ భద్రత, పౌరల రక్షణ ప్రధాన అంశం
వినియోగదారుల కాల్ లాగ్స్ నుంచే నేరుగా మోసపూరిత కాల్స్ పై ఫిర్యాదు చేయటానికి సంచార్ సాథీ అవకాశం కల్పిస్తోంది. అలాగే, అవగాహన ఉన్న వాళ్లు… ఇతరులను కూడా రక్షించగలుగుతారు.
"ప్రతి పౌరుడికి డిజిటల్ భద్రత కల్పించటం మా ప్రధాన ప్రాధాన్యత. సంచార్ సాథీ అనేది స్వచ్ఛందంగా వినియోగించగలిగేది, పారదర్శకమైనది. దేశంలోని మొబైల్ వినియోగదారులను రక్షించటానికి, దేశ సైబర్ భద్రతను మెరుగుపరచటానికి రూపొందించారు. వినియోగదారులు ఈ యాప్ ను ఎప్పుడైనా యాక్టివేట్ చేయటానికి లేదా తొలగించడానికి స్వేచ్ఛ ఉంటుంది. గోప్యతకు భంగం కలిగించకుండా భద్రతను కల్పిస్తుంది" అని సింధియా తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2197626)
आगंतुक पटल : 2