ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని శివగంగలో దుర్ఘటన: సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం
प्रविष्टि तिथि:
01 DEC 2025 10:23AM by PIB Hyderabad
తమిళనాడులోని శివగంగలో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"తమిళనాడులోని శివగంగలో జరిగిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని అందజేస్తాం: పీఎం’’
(रिलीज़ आईडी: 2196943)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam