ప్రధాన మంత్రి కార్యాలయం
2025-26 రెండో త్రైమాసికంలో భారత 8.2 శాతం బలమైన జీడీపీ వృద్ధిని స్వాగతించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 NOV 2025 6:24PM by PIB Hyderabad
2025-26 రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత రీతిలో 8.2 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఈ రోజు వెల్లడైన తాజా జీడీపీ గణాంకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ విజయం ప్రభుత్వ వృద్ధి అనుకూల విధానాలు, సంస్కరణల ప్రభావాన్ని... భారత ప్రజల కృషి, వ్యాపార ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి, ప్రతి పౌరుడి కోసం జీవన సౌలభ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చూసుకుంటున్నామని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"2025-26 రెండో త్రైమాసికంలో 8.2 శాతం జీడీపీ వృద్ధి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇది మా వృద్ధి అనుకూల విధానాలు, సంస్కరణల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది మా ప్రజల కృషి, వ్యాపార ప్రభావాన్నీ ప్రతిబింబిస్తుంది. మా ప్రభుత్వం సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, ప్రతి పౌరుడి కోసం జీవన సౌలభ్యాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తుంది."
***
(రిలీజ్ ఐడి: 2196708)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada