పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
చారిత్రక ప్రస్థానం: 5 కూనలకు జన్మనిచ్చిన మన చిరుత- ముఖి సంతాన వృద్ధి, వైవిధ్యమైన జన్యువులు గల చిరుత జాతి జనాభా పెరగటంపై ఆశావాద దృక్పథం: శ్రీ భూపేందర్ యాదవ్
Posted On:
20 NOV 2025 4:22PM by PIB Hyderabad
ప్రాజెక్టు చీతాలో భాగంగా జరిగిన చరిత్రాత్మకమైన అభివృద్ధిని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ వెల్లడించారు. భారత్లో జన్మించి, 33 నెలల వయసు గల మొదటి ఆడ చిరుత- ముఖి 5 కూనలకు జన్మనిచ్చిందని, భారత్లో మళ్లీ చిరుతలను పెంచే కార్యక్రమంలో ఇది కీలక విజయమని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు.
భారత్లో పుట్టిన చిరుత విజయవంతంగా పిల్లలను కనటం ఇటీవల కాలంలో ఇదే ప్రథమమని శ్రీ భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారతదేశ ఆవాసాల్లో ఈ జాతి చిరుతలు స్థానిక వాతావరణానికి అలవాటుపడటం, ఆరోగ్యంగా ఉండటం, దీర్ఘకాలిక మనుగడకు ఇది సంకేతమని ఆయన తెలిపారు.
తల్లి, పిల్లలూ ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించిన మంత్రి.. "భారత్లో స్వయంగా సంతతిని వృద్ధి చేసుకోగల, వైవిధ్యమైన జన్యువులు గల చిరుత జనాభాను పెంచటంపై ఆశావాద దృక్పథాన్ని ఈ పరిణామం బలపరుస్తుంది" అని అన్నారు.
ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన శ్రీ భూపేందర్ యాదవ్.. జీవజాల రక్షణకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు, ప్రాజెక్టు చీతా భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు.
***
(Release ID: 2192238)
Visitor Counter : 5