ప్రధాన మంత్రి కార్యాలయం
రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
Posted On:
19 NOV 2025 7:51AM by PIB Hyderabad
రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. తొలి
స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆమె చూపిన శౌర్య సాహసాల కథ ఇప్పటికీ భారతీయుల్లో ఉత్సాహాన్ని, తపనను పెంచుతుంది. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆమె చేసిన త్యాగాలు, పోరాటాలను భారత్ ఎప్పటికీ మర్చిపోదని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"భారతమాత అమర యోధురాలు రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెకు గౌరవపూర్వక నివాళులు. తొలి స్వాతంత్య్ర పోరాటంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు ఇప్పటికీ భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆమె చేసిన త్యాగాన్నీ, పోరాటాన్నీ కృతజ్ఞత గల భారత్ ఎన్నటికీ మర్చిపోదు"
***
MJPS/ST
(Release ID: 2191587)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam