ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవంబరు 19న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన


దక్షిణ భారత ప్రక‌ృతి వ్యవసాయం అంశంపై కోయంబత్తూరులో శిఖరాగ్ర సదస్సును ప్రారంభించనున్న ప్రధానమంత్రి


తొమ్మిది కోట్ల మంది రైతులకు రూ.18,000 కోట్ల విలువైన 21వ పీఎం-కిసాన్ వాయిదాను విడుదల చేయనున్న ప్రధానమంత్రి

పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి

భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జీవనం, ప్రబోధాలు, చిరకాల వారసత్వానికి గుర్తుగా స్టాంపుతో పాటు ఒక స్మారక నాణేన్ని ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి

Posted On: 18 NOV 2025 11:38AM by PIB Hyderabad

నవంబరు 19న ఆంధ్రప్రదేశ్తమిళనాడుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మహాసమాధి వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పిస్తారు. ఆనంతరం 10:30 గంటలకుభగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారుఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జీవనంప్రబోధాలుచిరకాల వారసత్వానికి గుర్తింపుగా స్టాంపులనూ, ఒక నాణేన్ని విడుదల చేస్తారుజనసమూహాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
ఆ తరువాతప్రధానమంత్రి తమిళనాడులోని కోయంబత్తూరుకు పయనమవుతారుఅక్కడ మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటలకు దక్షిణ భారత ప్రక‌ృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ కార్యక్రమంలో భాగంగాదేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు సహాయాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘పీఎం-కిసాన్’ 21వ వాయిదా కింద రూ.18,000 కోట్లకు పైగా నిధుల్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారుఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
దక్షిణ భారత ప్రక‌ృతి వ్యవసాయ సదస్సును తమిళనాడు నేచురల్ ఫార్మింగ్ స్టేక్‌హోల్డర్స్ ఫోరమ్ 2025 నవంబరు 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తుందిపర్యవరణానుకూల సాగు పద్ధతుల్నీప్రధానంగా రసాయనిక ఎరువులకు చోటులేని వ్యవసాయ పద్ధతుల్నీ దీర్ఘకాల ప్రాతిపదికన ప్రోత్సహించడం ఈ సదస్సు ధ్యేయంఅలాగేభారతదేశ వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్తును అందించడానికి ఆచరణీయరుతువుల ప్రభావాన్ని తట్టుకొనేలాభసాటిగా ఉండే ప్రకృతి అనుకూలపునరుత్పాదన ప్రధాన వ్యవసాయం దిశగా ముందుకు సాగడాన్ని వేగవంతం చేయాలనేది కూడా ఈ సదస్సు లక్ష్యం.
సేంద్రియ ఉత్పాదకాలుఅగ్రో-ప్రాసెసింగ్పర్యావరణానుకూల ప్యాకేజి విధానాలుదేశవాళీ సాంకేతికతలతో కూడిన నవకల్పనలను ప్రదర్శించడంపైనాగ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికులకూఫార్మర్-ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు మార్కెట్ లభ్యతపైనా ఈ శిఖరాగ్ర సదస్సు ప్రధానంగా దృష్టి పెడుతుందిఈ శిఖరాగ్ర సదస్సులో తమిళనాడుపుదుచ్చేరికేరళతెలంగాణకర్నాటకఆంధ్రప్రదేశ్‌లకు చెందిన రైతులుప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న వారుశాస్త్రవేత్తలుసేంద్రియ ఉత్పాదకాలను సరఫరా చేసే సంస్థల ప్రతినిధులుఅమ్మకందారులతో పాటు 50,000 మందికి పైగా ఆసక్తిదారులు పాలుపంచుకుంటారు

 

***


(Release ID: 2191210) Visitor Counter : 21