రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

తదుపరి దశ ప్రాజెక్ట్ చీతా కోసం ఎనిమిది చిరుతలను భారత్‌కు బహుకరించిన బోట్స్‌వానా.. మొకొలోడి నేచర్ రిజర్వ్‌లో చిరుతల విడుదలను వీక్షించిన భారత రాష్ట్రపతి


బోట్స్‌వానా ఉపరాష్ట్రపతి, అంతర్జాతీయ సంబంధాల శాఖ మంత్రిని కలిసిన రాష్ట్రపతి

బోట్స్‌వానాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ.. బోట్స్‌వానా పురోగతికి మీ వంతు కృషి చేయండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Posted On: 13 NOV 2025 5:34PM by PIB Hyderabad

బోట్స్‌వానాలోని మొకొలోడి నేచర్ రిజర్వ్‌ను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముబోట్స్‌వానా అధ్యక్షుడు అడ్వకేట్ శ్రీ డూమా గిడియన్ బోకో ఇవాళ (నవంబర్ 13, 2025) ఉదయం సందర్శించారు. 'ప్రాజెక్ట్ చీతాకింద భారతదేశానికి బోట్స్‌వానా నుంచి ఎనిమిది చిరుతలను అప్పగించేందుకు ఘాంజీ ప్రాంతం నుంచి విడుదల చేసిన చిరుతలను క్వారంటైన్ చేయటాన్ని ఇద్దరు నాయకులుఇరుదేశాల నిపుణులు వీక్షించారుదీనిద్వారా వన్యప్రాణుల సంరక్షణలో భారత్-బోట్స్‌వానా సహకారంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం అయింది.

బోట్స్‌వానా ఉపాధ్యక్షుడు గౌరవ న్డబా న్కోసినాథి గౌలతేఅంతర్జాతీయ సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ ఫెన్యో బుటాలే వేర్వేరుగా రాష్ట్రపతితో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీకి బయలుదేరే ముందుబోట్స్‌వానాలోని భారత హైకమిషనర్ గెబోరోన్‌లో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో అక్కడి భారతీయులనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారుఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తిరైల్వే శాఖ సహాయమంత్రి శ్రీ విసోమన్నపార్లమెంటు సభ్యులు శ్రీ పర్భూభాయ్ నాగర్‌భాయ్ వాసవశ్రీమతి డీ కే అరుణ హాజరయ్యారు.

ఉత్సాహంగా సమావేశమైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి.. వారి సహకారం పట్ల దేశం గర్విస్తుందన్నారువారు దేశానికి నిజమైన సాంస్కృతిక రాయబారులనికష్టపడి పనిచేయటంనిజాయితీసామరస్యం వంటి విలువలు భారత్‌కే కాకబోట్స్‌వానాకు గుర్తింపు తెస్తున్నాయని వెల్లడించారుబోట్స్‌వానా అభివృద్ధికి సహకారాన్ని కొనసాగిస్తూనే భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారుఓసీఐ పథకంప్రవాసీ భారతీయ దివస్ వంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలనిభారతదేశ అభివృద్ధికి వారు చేసిన పనులకు సంబంధించిన అనుభవాలను పంచుకోవాలని కోరారు.

విశ్వాసంగౌరవంఉమ్మడి ప్రజాస్వామ్య విలువలపై భారత్బోట్స్‌వానాల సంబంధాలు ఆధారపడి ఉన్నాయని రాష్ట్రపతి అన్నారుబోట్స్‌వానా అధ్యక్షుడు బోకోతో జరిగిన చర్చల సందర్భంగా వాణిజ్యంవిద్యఆరోగ్యండిజిటల్ సాంకేతికతవ్యవసాయంపునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో ఇరుదేశాలు మరింత సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తెలియజేశారు.

ఆఫ్రికా దేశాలయిన అంగోలాబోట్స్‌వానా పర్యటనలను విజయవంతంగా ముగించుకునిరాష్ట్రపతి నవంబర్ 14 ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంటారు

 

***


(Release ID: 2190007) Visitor Counter : 18