హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీ పేలుడుపై నిర్వహించిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాలకు అధ్యక్షత వహించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రతి నేరస్థుడిని పట్టుకుంటాం: అమిత్ షా

प्रविष्टि तिथि: 11 NOV 2025 6:57PM by PIB Hyderabad

ఢిల్లీ కారు పేలుడు ఘటనపై ఢిల్లీలో భద్రతా సంస్థలుకేంద్ర హోం శాఖ సీనియర్ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశాలకు కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు.

మొదటి సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శిఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏడైరెక్టర్ జనరల్ఢిల్లీ పోలీస్ కమిషనర్ హాజరయ్యారుజమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారురెండో సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శిఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ఎన్ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్డైరెక్టర్ జనరల్ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థడైరెక్టర్ జనరల్ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్ డైరెక్టర్ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ముఖ్య డైరెక్టర్ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

"ఢిల్లీ కారు పేలుడుకు సంబంధించి సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశాలకు అధ్యక్షత వహించాను.ఈ దుర్ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కడిని పట్టుకోవాలని ఆదేశించానుఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మన ఏజెన్సీల పూర్తి ఆగ్రహాన్ని చూస్తారు."

 

***


(रिलीज़ आईडी: 2189040) आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada