రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

అంబాలాలో రాఫెల్ యుద్ధ విమానంలో విహరించిన భారత రాష్ట్రపతి


శక్తిమంతమైన రాఫెల్ విమానంలో నా తొలి ప్రయాణం, దేశ రక్షణ సామర్థ్యాలపై నాకు అపారమైన గర్వాన్ని నింపింది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Posted On: 29 OCT 2025 1:18PM by PIB Hyderabad

ఇవాళ (అక్టోబర్ 29, 2025) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంబాలా (హర్యానా)లోని వైమానిక దళ కేంద్రంలో రాఫెల్ యుద్ధ విమానంలో విహరించారుభారత వైమానిక దళంలోని రెండు ఫైటర్ యుద్ధ విమానాల్లో విహరించిన తొలి రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. 2023లోనూ సుఖోయ్ 30 MKI విమానంలో ఆమె పయనించారు.

ఫ్రాన్స్ లోని డస్సాల్ట్ ఏవియేషన్ ఫెసిలిటీ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు చేరుకున్న తొలి వైమానిక దళ కేంద్రం అంబాలా.

భారత సాయుధ దళాల సర్వోన్నత కమాండర్ రాష్ట్రపతిదాదాపు 30 నిమిషాల పాటు సుమారు 200కి.మీప్రయాణించి తిరిగి వైమానిక దళ కేంద్రానికి చేరుకున్నారు. 17వ స్క్వాడ్రన్ కు కమాండింగ్ ఆఫీసరైన గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహాని ఆ విమానాన్ని నడిపారుసముద్రమట్టానికి దాదాపుగా 15,000 అడుగుల ఎత్తులోగంటకు సుమారు 700 కి.మీవేగంతో ఆ విమానం పయనించింది.

రాఫెల్ లో తన ప్రయాణం అనంతరంవిజిటర్స్ బుక్ లో రాష్ట్రపతి తన భావాలను నోట్ రూపంలో రాస్తూ.. "భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ విమానంలో నా తొలి ప్రయాణం కోసం అంబాలా వైమానిక దళ కేంద్రాన్ని సందర్శించినందుకు నేను సంతోషిస్తున్నానురాఫెల్ లో విహారం నాకు మర్చిపోలేని అనుభవంశక్తిమంతమైన ఈ విమానంలో నా తొలి పయనంతోదేశ రక్షణ సామర్థ్యాలపై నాకు అపారమైన నమ్మకం ఏర్పడిందిఈ విమాన ప్రయాణాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు భారత వైమానిక దళంఅంబాలా వైమానిక దళ కేంద్ర బృందానికి నా అభినందనలుఅని పేర్కొన్నారు.

రాఫెల్భారత వైమానిక దళ నిర్వహణ సామర్థ్యాల గురించి రాష్ట్రపతికి అధికారులు వివరించారు.

 

 

**** 

 

(Release ID: 2183983) Visitor Counter : 15