ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సీపీఆర్ అవగాహన వారోత్సవం – ప్రజా ప్రతిస్పందన సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు


దేశవ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ, అవగాహన పెంచే జాతీయ స్థాయి సమన్వయ కార్యక్రమం

సీపీఆర్ అవగాహన వారోత్సవం 2025 సందర్భంగా విస్తృత శిక్షణ ప్రచార కార్యక్రమాల నిర్వహణ

సీపీఆర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న 14,700 మందికి పైగా వ్యక్తులు; మై గవర్నమెంట్ ద్వారా 79,870 మంది డిజిటల్ ప్రమాణం

సీపీఆర్ అవగాహన వారంలో విస్తృతంగా డిజిటల్, యువత మమేకం: సీపీఆర్ ప్రశ్నోత్తర పోటీలో పాల్గొన్న 36,040 మంది పౌరులు, అవగాహన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న 368 మంది యువత

బహుళ మాధ్యమాల్లో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యకలాపాల ద్వారా నిమగ్నమైన 7.47 లక్షల పౌరులు

దేశవ్యాప్తంగా 6.06 లక్షల మందికి పైగా వ్యక్తులకు సీపీఆర్ శిక్షణ

Posted On: 22 OCT 2025 2:58PM by PIB Hyderabad

ప్రజల్లో సీపీఆర్ (కంప్రెషన్-ఒన్లీ కార్డియోపల్మనరీ రీససిటేషన్)పై అవగాహన పెంచడంఅత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాథమిక స్పందన సామర్థ్యాన్నిపెంపొందించే లక్ష్యంతో అక్టోబర్ 13 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా సీపీఆర్ అవగాహన వారోత్సవాన్ని ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిందిగుండెపోటుఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో తొందరగా చుట్టుపక్కనవాళ్లు స్పందించడంపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

సీపీఆర్ కు ప్రాణాలను రక్షించే సామర్థ్యం ఉందని ఎన్నో పరిశోధనల్లో నిరూపితమైనప్పటికీ, అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే భారత్ లో బాధితుల పక్కనే ఉండి తక్షణం స్పందించి సీపీఆర్ అందించే వారి సంఖ్య  తక్కువగానే ఉందివారం రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించేందుకు విస్తృత స్థాయిలో సీపీఆర్ శిక్షణఅవగాహనప్రవర్తన పరమైన సంసిద్ధతను ప్రజల్లో ప్రోత్సహించడాన్ని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

సీపీఆర్ అవగాహన వారోత్సవం లక్ష్యాలు: ప్రాణాలను కాపాడే సీపీఆర్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంవివిధ భాగస్వాముల సహకారంతో ఆచరణాత్మక శిక్షణలుప్రదర్శనలు అందించడంయువతలో సేవాభావం పెంపొందించడంసమాజ హిత కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా ప్రోత్సహించడండిజిటల్ వేదికలను వినియోగించి విస్తృతంగా ప్రజలకు ఈ సమాచారాన్ని చేరవేయడం.

ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా బహుళ భాగస్వాముల సమన్వయంతో అమలు చేశారు. గ్రామీణ స్థాయిలో శిక్షణలుఅవగాహన కార్యక్రమాలను నిర్వహించడంలో రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యవైద్య విద్యా శాఖలు కీలకపాత్ర పోషించాయిహోం మంత్రిత్వశాఖరక్షణకార్మికఉపాధియువజన వ్యవహారాలుక్రీడలుఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతికతఉన్నత విద్యపాఠశాల విద్యఅక్షరాస్యతరైల్వేలుఆరోగ్య పరిశోధన శాఖజాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వంటి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలుసంస్థలు.. సమాజంలోని వివిధ వర్గాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయికేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులుఏయిమ్స్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు.. శిక్షణలుఅవగాహన కార్యక్రమాలను నిర్వహించాయిఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తన రాష్ట్రకేంద్ర పాలిత ప్రాంతాలుజిల్లా ఉపకేంద్రాల్లో సామాజిక సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిందివృత్తిపరమైన సంస్థలు తమ రాష్ట్ర శాఖల ద్వారా శిక్షణఅవగాహన కార్యక్రమాలు నిర్వహించాయిడిజిటల్ అవగాహనయువత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎలక్ట్రానిక్స్ఐటీ మంత్రిత్వ శాఖయువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించాయి.

కార్యకలాపాల నిర్వహణ

సీపీఆర్ అవగాహన వారోత్సవం సందర్భంగా విస్తృత స్థాయిలో ప్రజలు పాల్గొనడం, అవగాహన పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారుఈసీహెచ్ఓ వేదికయూట్యూబ్ లైవ్ ద్వారా నిర్వహించిన సీపీఆర్ ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో మొత్తం 14,701 మంది పాల్గొన్నారుసీపీఆర్ అవగాహనకు కట్టుబడి ఉంటామని 79,870 మంది పౌరులు మై గవర్నమెంట్ వేదిక ద్వారా ప్రతిజ్ఞ చేశారు.

‘‘సీపీఆర్ పద్దతులుపక్కవాళ్ల పాత్ర” అనే అంశంపై నిపుణులతో చర్చాకార్యక్రమాలు నిర్వహించారువిపత్తు నిర్వహణ సెల్‌కు చెందిన ఉప డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చల్లో ఏయిమ్స్ న్యూఢిల్లీడాక్టర్ ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రిసఫ్దర్‌జంగ్ ఆసుపత్రిఎస్ జీటీ మెడికల్ కళాశాలకు చెందిన ఆరుగురు నిపుణులు పాల్గొన్నారుఈసీహెచ్ఓయూట్యూబ్ లైవ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో 10,129 మంది పాల్గొనగా.. వీరికి సీపీఆర్ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (ఏఈడీఉపయోగించడంపై ప్రత్యక్ష్య ప్రదర్శనలు ఇచ్చారు.

 

సీపీఆర్ అవగాహన వారోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీటిని రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల వైద్య శాఖలుకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులుఏయిమ్స్జాతీయ ప్రాధాన్యత గల సంస్థలుఇండియన్ రెడ్ క్రాస్ సంస్థవృత్తి పరమైన సంస్థలు నిర్వహించగా మొత్తం 6,06,374 మంది ఈ శిక్షణలో పాల్గొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిహౌస్‌కీపింగ్ సిబ్బందివివిధ మంత్రిత్వ శాఖల అధికారులకు నిర్మాణ్ భవన్ లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిచారుదీనిద్వారా మొత్తం 264 మంది లబ్ధి పొందారుఅలాగే ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన 70 మంది అధికారులకు అక్టోబర్ 16న ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

 

ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు మై గవర్నమెంట్, మై భారత్ వేదికల ద్వారా సీపీఆర్ పై ప్రశ్నోత్తరాల పోటీని నిర్వహించారుఇందులో 36,040 మంది పాల్గొన్నారువీటికితోడు ‘వాలంటీర్ ఫర్ భారత్’ కార్యక్రమం ద్వారా 368 మంది యువకులు సీపీఆర్ అవగాహనను ప్రోత్సహించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా సెల్ సహకారంతో సీపీఆర్ అవగాహనను పెంచేందుకు అనేక డిజిటల్, సామాజిక మాధ్యమాల ద్వారా కార్యకలాపాలను చేపట్టింది.మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో సీపీఆర్ పై ఒక విద్యా వీడియోను అభివృద్ధి చేసి ప్రచురించారుఈ వీడియోను రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు ప్రామాణిక విద్యా వనరుగా అందుబాటులో ఉంచారు.

నిపుణుల ఇంటర్వ్యూలను ఆంగ్లం, హిందీలో మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురించారుఇవి సీపీఆర్ సాంకేతిక అంశాలుప్రజలకు దాని ప్రాధాన్యతను తెలియజేస్తాయిఇతర ఐఈసీ (సమాచారంవిద్యకమ్యూనికేషన్మెటీరియల్స్కార్యక్రమ ప్రచారాలు అన్నీ కూడా డిజిటల్ వేదికలపై విస్తృత స్థాయిలో వీక్షణ పొందాయివీటికి ప్రజల మంచి స్పందన లభించింది.

ఆరోగ్యశాఖ కార్యదర్శి సమక్షంలో నిపుణుల ద్వారా అక్టోబర్ 13న నిర్వహించిన సీపీఆర్ ప్రత్యక్ష ప్రదర్శనను దూరదర్శన్ సహా పలు వార్తా సంస్థలు ప్రచురించాయిఅక్టోబర్ 19న దూరదర్శన్ ఛానల్ లో ‘‘టోటల్ హెల్త్ మెడికల్ ఎమర్జెన్సీ’’ అనే శీర్షికతో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశారుఇది సీపీఆర్ ప్రత్యక్ష ప్రదర్శనలను ప్రదర్శించిన ఈ కార్యక్రమంలో ఏయిమ్స్న్యూఢిల్లీ నుంచి నిపుణులు ప్యానెల్ సభ్యులుగా పాల్గొన్నారు.

బహుముఖ కార్యకలాపాల ద్వారా నిర్వహించిన సీపీఆర్ అవగాహన వారోత్సవంలో 7,47,000 మందికి పైగా పౌరులు నిమగ్నమయ్యారుదేశవ్యాప్తంగా 6,06,374 పైగా మందికి శారీరక శిక్షణ ఇచ్చారు.

 

***


(Release ID: 2181638) Visitor Counter : 9