రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా అధికార చిహ్నాన్ని జావెలిన్ క్రీడాకారుడు శ్రీ నీరజ్ చోప్రాకు లాంఛనంగా ప్రదానం చేసిన రక్షణ మంత్రి

లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదా) నీరజ్ చోప్రా నిరంతర శ్రమకూ, దేశభక్తికీ,

భారత్ అత్యుత్తమ సామర్ధ్యానికీ నిదర్శనం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

प्रविष्टि तिथि: 22 OCT 2025 1:22PM by PIB Hyderabad

ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకాలను సాధించిన జావెలిన్ క్రీడాకారుడు శ్రీ నీరజ్ చోప్రాకు ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను సూచించే అధికార చిహ్నాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలోని సౌత్ బ్లాకులో నిర్వహించిన కార్యక్రమంలో... స్వయంగా అలంకరించారుఈ సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవనీయ హోదానీరజ్ చోప్రాతోఆయన కుటుంబ సభ్యులతో రక్షణ మంత్రి మాట్లాడుతూ నిరంతర శ్రమకూదేశభక్తికీఅత్యుత్తమ సాధన కోసం పోరాడే భారతీయతకూ శ్రీ చోప్రా నిదర్శనమని ప్రశంసించారు.

  image.png

క్రమశిక్షణఅంకితభావందేశాభిమానం కలబోసుకున్న లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదానీరజ్ చోప్రా.. క్రీడాకారులతో పాటు సాయుధ దళాలకు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారుసైనిక దళాల ప్రధానాధికారి జనరల్  ఉపేంద్ర ద్వివేదితో పాటు భారతీయ సైన్యంలోనిప్రాదేశిక సైన్యంలోని ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

  image.png

లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదానీరజ్ చోప్రా 2016లో భారతీయ సైన్యంలో చేరారురాజ్‌పుఠాణా రైఫిల్స్‌కు తన సేవలను అందించారు. 1997 డిసెంబరు 24న హర్యానా పానిపట్ జిల్లాలోని ఖండ్రా గ్రామంలో పుట్టిన శ్రీ నీరజ్ చోప్రాఅంతర్జాతీయ క్రీడాపోటీల్లో ప్రశంసనీయ విజయాలను సాధించి... దేశానికీసాయుధ దళాలకూ అమిత గౌరవాన్ని తెచ్చిపెట్టారు.
జావెలిన్‌ను విసరడంలో పేరు తెచ్చుకున్న శ్రీ నీరజ్ చోప్రా 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారునిగా నిలిచి చరిత్ర స‌ృష్టించారు. 2024లో ప్యారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెల్చుకోవడంతో పాటు 2023 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించి తనదైన ప్రతిభను చాటారుఆసియా క్రీడలుకామన్‌వెల్త్ క్రీడలుడైమండ్ లీగ్ ఈవెంట్లలోనూ అనేక స్వర్ణ పతకాలను ఆయన సొంతం చేసుకున్నారుఈ ఏడాదిలో 90.23 మీటర్ల దూరం జావెలిన్‌ను విసరడం ఆయన అత్యుత్తమ ఆటతీరుకు అద్దం పట్టడమే కాక భారతీయ క్రీడాచరిత్రలోనే ఒక మహత్తర ఘట్టంగా కూడా నమోదైంది.  

దేశానికి ఆయన చేసిన సేవతో పాటు ఆయన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఈ  సంవత్సరం ఏప్రిల్ 16న ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను (గౌరవనీరజ్ చోప్రాకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము అందించారుఅంతకు ముందేపద్మ శ్రీమేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారంఅర్జున పురస్కారంపరమ విశిష్ట సేవా పతకంతో పాటు విశిష్ట సేవా పతకంతో కూడా కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది.

 

***


(रिलीज़ आईडी: 2181618) आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam