కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాజీ సైనికుల ఆరోగ్య పథకం లబ్ధిదారుల కోసం మందుల పంపిణీ సేవలను ప్రారంభించిన భారత తపాలాశాఖ

Posted On: 17 OCT 2025 1:54PM by PIB Hyderabad

మాజీ సైనికుల ఆరోగ్య పథకం (ఈసీహెచ్ఎస్) లబ్ధిదారుల కోసం ప్రత్యేకమైన మందుల పంపిణీ సేవను మాజీ సైనికుల సంక్షేమ శాఖ సహకారంతో భారత తపాలా శాఖ ప్రారంభించింది సేవ ద్వారా ఈసీహెచ్ ఎస్ పాలీక్లినిక్లలో అందుబాటులో లేని ముందులను లబ్ధిదారుల ఇంటికే నేరుగా పంపిస్తారు.

 కార్యక్రమం ద్వారా మందులను ఈసీహెచ్ఎస్ పాలీక్లినిక్స్ వద్ద ఉన్నసాధారణ సేవా కేంద్రం ద్వారా గ్రామ స్థాయి వ్యాపారులు సేకరించి ప్యాకింగ్ చేస్తారుతపాలాశాఖ విశ్వసనీయ డెలివరీ వ్యవస్థ ద్వారా మందులను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తారు విధానం ద్వారా ఔషధాలు సురక్షితంగాసమయానికిదేశం నలుమూలలలో ఉన్న లబ్ధిదారులకు చేరుతాయి.

 

 సేవను తొలిసారిగా 2025 జూలై 31 ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారుఅక్కడ విశేష స్పందన 

లభించడంతో  సేవను తరువాత జాతీయ రాజధాని ప్రాంతానికి (హర్యానాఉత్తరప్రదేశ్విస్తరించారుప్రయోగాత్మక ప్రాజెక్టులో1700 మందుల ప్యాకెట్లను పంపిణీ చేసి పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమవ్వడంతో.. దేశవ్యాప్తంగా 458 ఈసీహెచ్ఎస్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తయింది. 2025 అక్టోబర్ 17 నుంచి  సేవను దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

 కార్యక్రమం ద్వారా భారత తపాలా శాఖ తన విస్తృత పోస్టల్ వ్యవస్థను ప్రజాసేవ కోసం వినియోగించడంలో నిబద్ధతను మరోసారి చాటుకుంది సేవ ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు సకాలంలోనమ్మకంతో మందులు అందేలా చేస్తూ.. మాజీ సైనికుల సంక్షేమానికి కీలక పాత్ర పోషిస్తోందిఇది దేశ నిర్మాణంపౌర సంక్షేమంలో భాగంగా తపాలాశాఖ విశ్వసనీయతను మరింత బలపరుస్తుంది.

 

***


(Release ID: 2180401) Visitor Counter : 7