మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో మొదటిసారి అతిపెద్ద పాఠశాల స్థాయి ఆవిష్కరణల ప్రత్యక్ష పోటీ 3 లక్షలకు పైగా పాఠశాలలు పాల్గొన్న చరిత్రాత్మక ఘట్టం

పాఠశాల స్థాయి ఆవిష్కరణల పోటీ 'వికసిత్ భారత్ బిల్డథాన్ 2025'ను

ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

వికసిత, సమృద్ధ భారత్ సాధన మన ప్రతిభావంతులైన

పాఠశాల విద్యార్థుల భుజస్కంధాలపైనే ఉంది: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

प्रविष्टि तिथि: 13 OCT 2025 5:07PM by PIB Hyderabad

వికసిత్ భారత్ బిల్డథాన్ (వీబీబీ) 2025ను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారుదేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా పాఠశాలలు ఒకేసారి పాల్గొన్న ఈ “వికసిత్ భారత్ బిల్డథాన్ 2025” పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన భారతదేశంలోని అతి పెద్ద సమన్వయ ఆవిష్కరణ హ్యాకథాన్‌గా నిలిచిందిప్రారంభ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఒడిశా లోని భువనేశ్వర్‌లో ఖోర్డా పీఎంశ్రీ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులతో సంభాషించారు.

 

ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ... ఈ భారీ పాఠశాల స్థాయి ఆవిష్కరణల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉత్సాహంగా పాల్గొన్న మూడు లక్షలకుపైగా పాఠశాలలువిద్యార్థులను అభినందించిశుభాకాంక్షలు తెలిపారుఇక్కడి నుంచి పుట్టుకొచ్చే సృజనాత్మక ఆలోచనలు కొత్త ప్రపంచ నమూనాల సృష్టికి దారితీస్తాయనిదేశీయప్రపంచవ్యాప్త ప్రధాన సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడతాయని శ్రీ ప్రధాన్ విశ్వాసం వ్యక్తం చేశారువికసితసమృద్ధ భారత్‌ సాధన మన ప్రతిభావంతులైన పాఠశాల విద్యార్థుల భుజస్కధాలపైనే ఉందని మంత్రి పేర్కొన్నారువికసిత్ భారత్ బిల్డథాన్ (వీబీబీ వంటి మార్పుదాయక ప్రయత్నాల ద్వారానే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత సాకారం అవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారుదేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

విద్యా మంత్రిత్వశాఖకు చెందిన పాఠశాల విద్యఅక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ మాట్లాడుతూఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యాన్నికృషిని ప్రశంసించారుఈ విభిన్నమైన కార్యక్రమం విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించివారి సృజనాత్మక దృక్పథాన్ని మరింత బలపరుస్తుందని అన్నారుఈ కార్యక్రమానికి మార్గనిర్దేశం చేసి మద్దతు అందించిన కేంద్ర విద్యామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిషన్ డైరెక్టర్ శ్రీ దీపక్ బగ్లా మాట్లాడుతూ, వికసిత్ భారత్ బిల్డథాన్ ప్రాముఖ్యతను వివరించారుఈ బిల్డథాన్ ఆవిష్కరణల ప్రక్రియను సామూహిక ఉద్యమంగా మార్చి, మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను మహానగరాల్లోని పాఠశాలలతో అనుసంధానిస్తుందని తెలిపారు.

 

విద్యార్థులుఉపాధ్యాయులతో సంభాషించేందుకు ఢిల్లీ మాతురా రోడ్‌లోని డెల్హీ పబ్లిక్ స్కూల్ఢిల్లీ కంటోన్మెంట్ లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ నెం. 2 ను కూడా శ్రీ ప్రధాన్ సందర్శించారువిద్యార్థులు ప్రదర్శించిన వివిధ సృజనాత్మక ప్రాజెక్టులను శ్రీ ప్రధాన్ పరిశీలించివారి అభ్యసన ప్రక్రియల గురించి తెలుసుకున్నారువారి సృజనాత్మకతనుఉత్సాహాన్ని ప్రశంసిస్తూనిరంతరం జిజ్ఞాసువులుగా ఉండాలని ఉద్బోధించారుఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనకు దోహదపడగల వారి అసాధారణ సృజనాత్మకతను అభినందించారు.

 

ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 120 నిమిషాల ఆవిష్కరణల ప్రత్యక్ష పోటీ జరిగిందిరెండు గంటల పాటు జరిగిన ఈ లైవ్ టింకరింగ్ సెషన్‌లో కోటి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారుఇందులో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు 3–5 మంది చొప్పున జట్లుగా ఏర్పడి ఆత్మనిర్భర్ భారత్స్వదేశీవోకల్ ఫర్ లోకల్సమృద్ధి అనే నాలుగు ఇతివృత్తాలపై ప్రోటోటైప్‌లను రూపొందించారుఈ కార్యక్రమంలో స్కూల్ స్పాట్‌లైట్స్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందిదీనిలో మారుమూల ప్రాంతాలుఆకాంక్ష జిల్లాలుకొండ రాష్ట్రాలుసరిహద్దు ప్రాంతాల నుంచి 150కి పైగా పాఠశాలలు నేరుగా అనుసంధానమై తమ పురోగతినిఅనుభవాలను పంచుకున్నాయి.

 

రిజిష్టర్ చేసుకున్న పాఠశాలలు ( రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలవారీగా)

 

***


(रिलीज़ आईडी: 2178755) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , English , Urdu , Marathi , Bengali-TR , Punjabi , Odia , Kannada , Malayalam