ప్రధాన మంత్రి కార్యాలయం
బందీల విడుదలను స్వాగతించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
శాంతిని నెలకొల్పేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్దతు ప్రకటించిన ప్రధాని
प्रविष्टि तिथि:
13 OCT 2025 7:19PM by PIB Hyderabad
రెండు సంవత్సరాలకు పైగా బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. బందీల కుటుంబాల ధైర్యానికీ, శాంతి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.
ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు అంకితభావంతో అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు ప్రధాని శ్రీ మోదీ మద్దతు పలికారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“రెండు సంవత్సరాలకు పైగా బందీలుగా ఉన్న వారందరి విడుదలను మేం స్వాగతిస్తున్నాం. వారి స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యం, శాంతి కోసం అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలు, ప్రధానమంత్రి నెతన్యాహు దృఢ సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు అధ్యక్షుడు ట్రంప్ నిబద్ధతతో తీసుకుంటున్న చర్యలకు మేం మద్దతునిస్తున్నాం.”
(रिलीज़ आईडी: 2178753)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam