ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తమిళనాడు‌లోని కరూర్‌లో ఓ రాజకీయ ర్యాలీ సందర్భంగా దురదృష్టకర ఘటన.. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 SEP 2025 12:03PM by PIB Hyderabad

తమిళనాడు‌లోని కరూర్‌లో ఓ రాజకీయ ర్యాలీ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న ఘటనలో మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రకటించారుఇదే ఘటనలో గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఎంఓ ఇండియా వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ:


‘‘తమిళనాడు‌లోని కరూర్‌లో ఓ రాజకీయ ర్యాలీ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న ఘటనలో మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ ప్రకటించారుక్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారంగా అందజేస్తారు’’ అని పేర్కొంది.


(रिलीज़ आईडी: 2172584) आगंतुक पटल : 37
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam