ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రష్యా ఉప ప్రధాని శ్రీ దిమిత్రీ పాత్రుషేవ్ భేటీ
వ్యవసాయం, ఎరువులు, ఆహార శుద్ధి తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించిన నేతలు
భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం అధ్యక్షుడు శ్రీ పుతిన్కు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2025 8:57PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రష్యా ఉప ప్రధాని గౌరవ దిమిత్రీ పాత్రుషేవ్ ఈ రోజు సమావేశమయ్యారు.
వ్యవసాయం, ఎరువులు, ఆహార శుద్ధి రంగాలతో పాటు రెండు దేశాల ప్రయోజనాలూ ముడిపడి ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని ఇప్పటి కన్నా మరింత పెంచుకోవడంపై వారు తమ ఆలోచనలను పంచుకున్నారు.
అధ్యక్షుడు శ్రీ పుతిన్కు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వచ్చే శ్రీ పుతిన్కు భారత్లో స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నానని శ్రీ మోదీ అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2171979)
సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam