ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

Posted On: 21 SEP 2025 6:09PM by PIB Hyderabad

నా ప్రియమైన దేశవాసులారా... నమస్కారం!

శక్తిని ఆరాధించే పండగ అయిన నవరాత్రి రేపు ప్రారంభమవుతుందిమీ అందరికీ శుభాకాంక్షలునవరాత్రి మొదటి రోజే..  దేశం ఆత్మనిర్భర్ భారత్‌ వైపు మరో ముఖ్యమైన ముందడుగు వేస్తోందిరేపు అంటే సెప్టెంబర్ 22న నవరాత్రి మొదటి రోజు నాడు సూర్యుడు ఉదయించే మాదిరిగానే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు కూడా అమలులోకి రానున్నాయిఒక విధంగా దేశంలో రేపటి నుంచి జీఎస్టీ పొదుపు అనే పండగ ప్రారంభం కానుందిఈ జీఎస్టీ పండగ మీ పొదుపులను పెంచుతుంది.. మీరు కావలసిన వస్తువులను మరింత తక్కువ ధరకు కొనుక్కునేలా చూసుకుంటుందిమన దేశంలోని పేదలుమధ్యతరగతి ప్రజలునవమధ్యతరగతియువతరైతులుమహిళలుదుకాణదారులువ్యాపారవేత్తలువ్యవస్థాపకులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ పొదుపు అనే పండగ నుంచి చాలా ప్రయోజనం పొందుతారుఅంటే ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరు తీపి కబురు ఉండటంతో పాటు దేశంలోని ప్రతి కుటుంబం ఆశీర్వాదం పొందుతుందన్న మాటతదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాటు పొదుపనే ఈ పండగ విషయంలో దేశంలోని కోట్లాది కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలుశుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఈ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తాయివ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.. పెట్టుబడులు పెట్టటాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది.. అభివృద్ధికి సంబంధించిన పోటీలో ప్రతి రాష్ట్రాన్ని సమాన స్థానంలో నిలబెడుతుంది

మిత్రులారా,

2017లో జీఎస్టీ సంస్కరణ దిశగా భారత్‌ అడుగులు వేసినప్పుడు.. చరిత్రలో ఒక మార్పునకుకొత్త చరిత్రను సృష్టించేందుకు పునాది పడిందిదశాబ్దాలుగా మీ అందరితో పాటు మన దేశ ప్రజలుదేశంలోని వ్యాపారవేత్తలు..వివిధ పన్నులనే చిక్కులో పడి ఉన్నారుఆక్ట్రాయ్ప్రవేశపన్నువిక్రయ పన్నుఎక్సైజ్వ్యాట్సేవా పన్ను తదితర డజన్ల కొద్దీ పన్నులు మన దేశంలో ఉండేవిఒక నగరం నుంచి మరో నగరానికి వస్తువులను పంపాల్సి వస్తే చాలా చెక్‌ పోస్టులను దాటటంతో పాటు చాలా కాగితాలను నింపాల్సి వచ్చేది.. చాలా అడ్డంకులు ఎదుర్కోవల్సి వచ్చేది.. ప్రతిచోటా వేర్వేరు పన్ను నియమాలు ఉండేవి. 2014లో భారత్‌ నాకు ప్రధానమంత్రి పదవి బాధ్యతలు ఇచ్చిన మొదట్లో ఒక విదేశీ వార్తాపత్రికలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చిందిఅందులో ఒక కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారుఆ కంపెనీ సొంత వస్తువులను బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు పంపటం అనేది చాలా కష్టమని భావించేదని తెలిపిందిమొదట వస్తువులను బెంగళూరు నుంచి ఐరోపాకు పంపించివాటిని మళ్లీ అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు పంపించేందుకు మొగ్గుచూపినట్లు ఈ కథనం పేర్కొంది

మిత్రులారా,

అప్పుడు పన్నులుటోల్‌ల సంక్లిష్టత కారణంగా పరిస్థితి ఇలా ఉండేదిపాత ఉదాహరణను మాత్రమే నేను మీకు చెబుతున్నానువివిధ రకాల పన్నులనే చిక్కుముడుల కారణంగా లక్షలాది కంపెనీలుకోట్లాది దేశప్రజలు ప్రతిరోజూ సమస్యలను ఎదుర్కొనేవారుఒక నగరం నుంచి మరొక నగరానికి వస్తు రవాణా చేయటంలో అయ్యే ఖర్చును కూడా పేదలే భరించేవారు.. ఆ మొత్తాన్ని మీలాంటి వినియోగదారుల నుంచి తిరిగి పొందేవారు

మిత్రులారా,

ఈ పరిస్థితి నుంచి దేశాన్ని బయట పడేయటం చాలా ముఖ్యమైన విషయంఅందుకే 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు.. ప్రజాజాతీయ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీని మేం ప్రాధాన్యత తీసుకున్నాంప్రతి ఒక్క భాగస్వామితో చర్చించాం.. రాష్ట్రాలన్నీ వెలిబుచ్చిన సందేహాలను నివృత్తం చేశాం.. ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికాంఅన్ని రాష్ట్రాలను ఏకతాటికి తీసుకురావటం వలన స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద పన్ను సంస్కరణ సాధ్యమైందికేంద్రంతో పాటు రాష్ట్రాలు చేసిన కృషి ఫలితంగా డజన్ల కొద్దీ పన్నులనే వల నుంచి దేశం విముక్తి పొందింది.. దేశం మొత్తానికి ఒకే విధమైన పన్ను వ్యవస్థ వచ్చింది.. ఒకే దేశం-ఒకే పన్ను కల నెరవేరింది

మిత్రులారా,

సంస్కరణలు అనేవి నిరంతరం కొనసాగే ప్రక్రియకాలం మారుతున్న కొద్దీదేశ అవసరాలు పెరుగుతున్న కొద్దీ తదుపరి తరం సంస్కరణలు కూడా అంతే అవసరం అవుతాయిఅందుకే దేశానికి ఉన్న ప్రస్తుత అవసరాలుభవిష్యత్తుకు సంబంధించిన కలలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త జీఎస్టీ సంస్కరణలను తీసుకొచ్చాం

కొత్త జీఎస్టీలో ఇప్పుడు ఐదుపద్దెనిమిది శాతం పన్ను రేట్లు మాత్రమే ఉంటాయిదీనివల్ల రోజువారీగా ఉపయోగించే చాలా వస్తువుల ధర మరింత అందుబాటులోకి వస్తుందిఆహార పదార్థాలువివిధ వస్తువులుమందులుసబ్బుబ్రష్‌లుటూత్‌ పేస్టులుఆరోగ్యంజీవిత బీమా తదితర అనేక వస్తు సేవలపై సున్నా లేదా ఐదు శాతం పన్ను మాత్రమే ఉంటుందిగతంలో 12 శాతం పన్ను ఉన్న వస్తువులలో 99 శాతం.. అంటే దాదాపు 100 శాతం ఇప్పుడు శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి.

మిత్రులారా

గత 11 సంవత్సరాల్లో దేశంలోని 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారుపేదరికం నుంచి బయటపడటం ద్వారా ఈ 25 కోట్ల జన సమూహం నేడు నవ-మధ్యతరగతిగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారుఈ నవ మధ్యతరగతికి సొంత ఆకాంక్షలుకలలు ఉన్నాయిరూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేస్తూ ప్రభుత్వం వారికి బహుమతిని ఇచ్చింది

12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉండటం మధ్యతరగతి ప్రజల జీవితాల్లో భారీ మార్పు తీసుకొస్తుందివాళ్ల జీవితం సులభతరంగా మరింత సౌకర్యవంతంగా మారుతుందిఇప్పుడు పేదల వంతునవ మధ్యతరగతి వంతుఇప్పుడు పేదలునవ మధ్యతరగతిమధ్యతరగతి వాళ్లకు రెట్టింపు బోనాంజా లభిస్తుందిజీఎస్టీ తగ్గింపు వలన దేశ ప్రజలు.. వారి కలలను నెరవేర్చుకోవడం అనేది ఇప్పుడు సులభతం అవుతుందిఇల్లు కట్టుకోవడం అయినా.. టీవీరిఫ్రిజిరేటర్స్కూటర్బైక్కారు వంటివి కొనుగోలు చేయటం అయినా తక్కువ ఖర్చు అవుతుందిహోటళ్లలో చాలా వాటిపై జీఎస్టీ తగ్గినందుకు ప్రయాణాలు కూడా చౌకగా మారుతాయి

అయితే మిత్రులారా

జీఎస్టీ సంస్కరణ పట్ల దుకాణ సోదరీసోదరులు కూడా చాలా ఉత్సహాన్ని చూపిస్తుండటం నాకు సంతోషంగా ఉందితగ్గిన జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయటంలో వాళ్లు చాలా బిజీగా ఉన్నారుపాతకొత్త ధరలను తెలిపే బోర్డులు చాలా చోట్ల పెడుతున్నారు

మిత్రులారా,

మనం పాటిస్తోన్న ‘నాగరిక దేవో భవ:’ అనే సూత్రం.. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలో స్పష్టంగా కనిపిస్తోందిఆదాయపు పన్నుజీఎస్టీ మినహాయింపును కలిపి చూస్తే.. ఒక సంవత్సరంలోనే తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ప్రజలకు రూ. 2.5 లక్షల కోట్లకు పైగా ఆదా కానున్నాయిఅందుకే ఇది పొదుపు పండగ అని నేను చెబుతున్నాను

మిత్రులారా

అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్యాన్ని సాధించడానికి స్వావలంబన అనే మార్గాన్ని మనం అనుసరించాలిదేశాన్ని స్వావలంబనగా మార్చే బృహత్తర బాధ్యత.. మన చిన్నమధ్య తరహాకుటీర పరిశ్రమలు అయిన ఎంఎస్ఎంఈలపై కూడా ఉందిదేశ ప్రజలకు అవసరమైనవిదేశంలోనే తయారు చేయగలిగినవన్నీ దేశంలోనే తయారు చేయాలి.

మిత్రులారా

జీఎస్టీ రేట్ల తగ్గింపునియమాలువిధానాల సరళీకరణతో మన ఎంఎస్ఎంఈలు.. మన చిన్న తరహాకుటీర పరిశ్రమలు చాలా ప్రయోజనం పొందుతాయివాటి విక్రయాలు పెరగటంతో పాటు అవి తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందిఅంటే ఇవి కూడా రెట్టింపు ప్రయోజనం పొందుతాయిఎంఎస్ఎంఈలుచిన్న పరిశ్రమలు లేదా కుటీర పరిశ్రమలు ఇలా ఏవైనా కావొచ్చు.. ఇవాళ నాకు వీటన్నింటిపైన గొప్ప అంచనాలు ఉన్నాయిభారత్ ‌సుసంపన్నత అనే శిఖరాగ్రంలో ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మన ఎంఎస్ఎంఈలుమన చిన్నకుటీర పరిశ్రమలు ఉంటాయన్న విషయం మీకు కూడా తెలుసుభారత్‌లో తయారైనదేశంలో ఉత్పత్తైన వస్తువుల నాణ్యత ఒకప్పుడు చాలా బాగుండేదిమనం ఆ గౌరవాన్ని తిరిగి పొందాలిమన చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేసే ప్రతి ఒక్క వస్తువు అన్ని రకాల ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగాఉత్తమమైన వాటిలోనే ఉత్తమమైనదిగా ఉండాలిమనం తయారు చేసేవి.. గర్వంప్రతిష్ఠను ప్రదర్శిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారామితులన్నింటిని అధిగమించాలిమన ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరిచేందుకుప్రపంచవ్యాప్తంగా భారత్ గుర్తింపును పెంచేందుకుదేశ గౌరవాన్ని పెంచేందుకు మనం కృషి చేయాలి.

మిత్రులారా

దేశ స్వాతంత్ర్యం స్వదేశీ మంత్రం ద్వారా బలపడినట్లే.. దేశ సుసంపన్నత కూడా స్వదేశీ మంత్రం ద్వారా బలపడుతుందితెలిసి తెలియకుండానే అనేక విదేశీ వస్తువులు నేటి మన దైనందిన జీవితంలో భాగమయ్యాయిమనకు దీని గురించి తెలియదుమన జేబులో ఉన్న దువ్వెన స్వదేశీనా లేక విదేశీనా అన్న విషయం కూడా మనకు తెలియదుమన యువతకుమారులుకుమార్తెలు చెమటోడ్చి తయారు చేసిన స్వదేశీ వస్తువులనే కొనాలిమనం ప్రతి ఇంటిని స్వదేశీకి చిహ్నంగా మార్చాలిప్రతి దుకాణ అలంకరణ స్వదేశీతో జరగాలిఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి. ‘నేను స్వదేశీని కొంటానునేను స్వదేశీని విక్రయిస్తాను’ అని సగర్వంగా చెప్పండిఇదే ప్రతి భారతీయుడి వైఖరిగా మారాలిఇది వాస్తవ రూపం దాల్చినప్పుడు భారత్ ‌వేగంగా అభివృద్ధి చెందుతుందిస్వావలంబన భారత్స్వదేశీ అనే నినాదాలతో తయారీని వేగవంతం చేయాలని.. పూర్తి శక్తిఉత్సాహంతో ముందుకుసాగాలని నేను రాష్ట్రాలను కోరుతున్నానుపెట్టుబడికి ఉన్న అనుకూల వాతావరణాన్ని మెరుగుపరచాలికేంద్రంరాష్ట్రాలు కలిసి ముందుకు సాగినప్పుడు స్వావలంబన భారత్ అనే కల నెరవేరుతుంది.. దేశంలోని ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. భారత్‌ అభివృద్ధి చెందుతుందిఈ సెంటిమెంట్‌తో ఈ పొదుపు పండగకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నానుమరోసారి మీ అందరికీ నవరాత్రిజీఎస్టీ పొదుపు పండగ శుభాకాంక్షలు చెబుతున్నాను

చాలా ధన్యవాదాలు!...

 

***


(Release ID: 2169571)