ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమూల్ సంస్థ , జీసీఎంఎంఎఫ్‌ స్వర్ణోత్సవ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 22 FEB 2024 1:26PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారుగుజరాత్ ప్రియతమ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారుకేంద్రమంత్రులు పర్షోత్తం రూపాలా గారుసీఆర్ పాటిల్ గారుఅముల్ చైర్మన్ శ్రీ శ్యామల్‌భాయ్ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన నా సోదరీసోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు!

50 సంవత్సరాల కిందట గుజరాత్ గ్రామాల ప్రజలు నాటిన మొక్క నేడు అద్భుతమైన మర్రి చెట్టుగా ఎదిగిందిఇప్పుడు ఆ భారీ మర్రి చెట్టు కొమ్మలు దేశమంతటావిదేశాల్లోనూ విస్తరించాయిగుజరాత్ సహకార పాల మార్కెటింగ్‌ సంస్థ స్వర్ణోత్సవం సందర్భంగా మీ అందరికీ... ప్రతి మహిళకూపురుషుడికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానుగుజరాత్ పాల ఉత్పత్తి సంఘాలతో అనుసంధానమైన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నానుఈ ప్రయాణంలో మరో ముఖ్యమైన భాగస్వామిని కూడా మనం గుర్తించాయిపాడి పరిశ్రమలో ప్రధాన భాగస్వాములు మన పశువులే.. ఈ విజయానికి అవి అందించిన గొప్ప సహకారాన్ని నేను గౌరవిస్తున్నానుపశువులు లేకుండా పాడి పరిశ్రమ అసంపూర్ణంఅందుకే మన దేశంలోని పశువులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

సోదరీసోదరులారా!

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక బ్రాండ్లు పుట్టుకొచ్చాయికానీ అమూల్ వంటి బ్రాండ్‌ మరొకటి లేదునేడు అమూల్ దేశ పశువుల పెంపకందారుల ధైర్యానికీసామర్థ్యానికీ ప్రతీకగా నిలుస్తోందిఅమూల్ విశ్వాసంపురోగతిప్రజా భాగస్వామ్యాన్నిరైతుల సాధికారతను ప్రతిబింబిస్తోందిఇది సంప్రదాయంతో ఆధునికతను జోడించడం ద్వారా స్వావలంబన భారత్‌కు స్పూర్తిగా నిలుస్తోందిఇది ఉన్నత ఆశయాలుసంకల్పాలుఅసాధారణ విజయాలను అందిస్తుందిఅమూల్ ఉత్పత్తులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 18 వేలకు పైగా పాల సహకార సంఘాలు, 36 లక్షలకు పైగా రైతులుప్రతిరోజూ సగటున 3.5 కోట్ల లీటర్ల పాల సేకరణపశువుల పెంపకందారులకు రోజూ రూ. 200 కోట్లకు పైగా ఆన్‌లైన్ చెల్లింపులతో అమూల్‌ను అద్భుతమైన సంస్థగా నిలుపుతోందిచిన్న స్థాయి పశుపోషకులను కలిగిన ఈ సంస్థ.. సమాఖ్యసహకార శక్తిని ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందుతోంది.

సోదరీసోదరులారా!

రాబోయే తరాల భవిష్యత్తు కోసం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి అమూల్ ఒకసర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ మార్గదర్శకత్వంలో ఖేడా పాలు ఉత్పత్తిదారుల సంఘంగా ప్రారంభమైన ఈ సంస్థ.. ఇదే గట్టి పునాదిపై నేడు అమూల్‌గా ఎదిగిందితరువాతి కాలంలో గుజరాత్‌లో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు విస్తరించాయివీటి సమన్వయంతో గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీఎంఎంఎఫ్‌ఏర్పడిందినేటికి కూడా ఇది ప్రభుత్వంసహకార సంస్థల సమన్వయంతో ఓ ఆదర్శప్రాయమైన నమూనాగా మారిందిఈ సమిష్టి కృషి వల్లే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తిదారుదేశంగా ఎదిగిందిసుమారు కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగా పాడి పరిశ్రమలో భాగమై ఉన్నారుగత దశాబ్దంలో దేశంలో పాల ఉత్పత్తి సుమారు 60 శాతం పెరిగిందితలసరి పాల లభ్యత సుమారు 40 శాతం పెరిగిందిప్రపంచ పాడి పరిశ్రమ సగటున శాతం పెరుగుతోంటే.. భారత్‌లో ఇది శాతం వేగంతో అభివృద్ధి చెందుతోందిఇది ఎంతో గొప్ప విషయం.

మిత్రులారా!

దేశ పాడి పరిశ్రమలో ఒక కీలకమైన అంశం తరచూ మన దృష్టికి రాదుఈ సందర్భంగా ఆ అంశాన్ని నేను లోతుగా చర్చించాలనుకుంటున్నానుదేశంలో రూ.10 లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన పాడి పరిశ్రమను నడిపిస్తున్న ప్రధాన శక్తి..మన దేశ మహిళలుమన సమాజంలో ఉన్న తల్లులుఅక్కలుచెల్లెళ్ళు ఈ రంగానికి అపారమైన సేవలు అందిస్తున్నారువరిగోధుమచెరుకు వంటి ప్రధాన పంట టర్నోవర్ కూడా పాడి పరిశ్రమ టర్నోవర్‌తో సరిపోలదువిశేషమేంటంటే ఈ పాడి పరిశ్రమలోని 70 శాతం పని... మన తల్లులుఅక్కాచెల్లెళ్లే చేస్తున్నారువారు నిజంగా దేశ పాడి పరిశ్రమకు వెన్నుముకగా నిలిచారుమహిళల శక్తిని ఇది స్పష్టంగా చూపిస్తోందినేడు అమూల్ సాధించిన అసాధారణ విజయానికి మహిళలే ప్రధాన కారణం. “మహిళా నేతృత్వంలోని అభివృద్ధి’’ మంత్రంతో భారత్ ముందుకు సాగుతున్న ఈ సమయంలో పాడి పరిశ్రమ విజయం ఒక గొప్ప స్పూర్తిగా నిలుస్తోందిదేశ అభివృద్ధి కోసం ప్రతి మహిళా ఆర్థికంగా శక్తిమంతం కావాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నానుఅందుకే మా ప్రభుత్వం వివిధ రంగాల్లో మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందిముద్ర యోజన ద్వారా ఇప్పటి వరకు రూ. 30 లక్షల కోట్లకుపైగా రుణాలు ఇవ్వగా.. అందులో సుమారు 70 శాతం లబ్ధిదారులు మహిళలేగత దశాబ్దంలో స్వయం సహాయక బృందాల్లో చేరిన మహిళల సంఖ్య 10 కోట్లను దాటింది.. ఈ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్లకుపైగా ఆర్థిక సాయాన్ని అందిస్తోందివీటికితోడు ప్రధానమంత్రి అవాస్ యోజన ద్వారా నిర్మించిన కోట్ల ఇళ్లలో అధిక భాగం మహిళల పేరుతో నమోదు కావడం సమాజంలో వారి పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని సూచిస్తుందిమీరు "నమో డ్రోన్‌దీదీఅనే కార్యక్రమం గురించి వినే ఉంటారుఇది గ్రామీణ మహిళల సాధికారతను మరింత శక్తిమంతం చేయాలనే ఉద్దేశంతో రూపొందించాంఈ పథకం ద్వారా గ్రామీణ స్వయం సహాయక బృందాలకు 15 వేల ఆధునిక డ్రోన్లు అందిస్తున్నారువాటిని ఉపయోగించేందుకు మహిళలకు శిక్షనిస్తున్నారుత్వరలోనే పంటలకు పురుగుమందుల పిచికారీ నుంచి ఎరువుల పంపిణీ వరకూ వివిధ గ్రామ కార్యకలాపాల్లో ‘నమో డ్రోన్‌దీదీలు’ కీలక పాత్ర పోషించేందుకుఎక్కువ సమయం పట్టదు.

మిత్రులారా!

గుజరాత్‌లోని మన పాడి  సహకార సంఘాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నానునేను గుజరాత్‌లో పని చేస్తున్న సమయంలో పాడి పరిశ్రమలో పొల్గొనే మహిళల కోసం ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించాంపాడి డబ్బులు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యేలా చేశాంఈ పద్దతిని నేటికీ అమూల్ కొనసాగిస్తున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానుప్రతి గ్రామంలో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేయడం వల్ల పశు పోషకులకు నగదు ఉపసంహరణ మరింత సులభంగా అందుబాటులోకి వస్తోందిఅంతేకాక పశుపోషకులకు త్వరలో రుపే క్రెడిట్ కార్డులు జారీ చేయాలన్న యోజన కూడా ఉందిపంచమహాల్,  బనాస్కంత జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులుగా ఈ కార్యాచరణ ప్రారంభం కానుందిఈ చర్యలన్నీ మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడంలోగ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

సోదరీసోదరులారా!

‘‘దేశం ఆత్మ దాని  గ్రామాల్లో ఉంది’ అని ఒకప్పుడు గాంధీ చెప్పినట్లు.. అభివృద్ధి చెందిన భారత్‌ను తీర్చిదిద్దడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా అవసరంగత కేంద్ర ‍ప్రభుత్వాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవసరాలను విచ్ఛిన్నం చేశాయికానీ మా ప్రభుత్వం గ్రామీణ జీవితంలోని అనే సమస్యలను పరిష్కరిస్తూ సమగ్ర విధానాన్ని తీసుకొచ్చిందిచిన్న రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంపశుసంవర్ధక రంగాన్ని విస్తరించటంపశువుల ఆరోగ్యంసంక్షేమాన్ని పెంపొందించటం మా ప్రాథమిక లక్ష్యంగ్రామీణ ప్రాంతాల్లో మత్స్యపెంపకంతేనెటీగల పెంపకం వంటి ఇతర జీవనోపాధి మార్గాలకు కూడా ప్రోత్సాహం అందించాంఈ దిశగా పశుపోషకులుమత్స్యకారులకు తొలిసారిగా కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాంవాతావరణ మార్పులకు తట్టుకునే శక్తి గల ఆధునిక విత్తనాలను రైతులకు అందించాంపాడి పశువుల జాతి మెరుగుదల కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి పథకాలను రూపొందించాంపాదంనోటి వ్యాధి చాలా కాలంగా మన పశువులను పీడిస్తోందిదీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లకుపైగా ఖర్చు చేసిదేశవ్యాప్తంగా ఉచిత టీకాలు వేయిస్తుందిఇప్పటి వరకు 60 కోట్ల టీకాలు ఇచ్చింది.  2030 నాటికి ఈ వ్యాధిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించడమే మా లక్ష్యం.

మిత్రులారా,

నిన్న రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో మా ప్రభుత్వం పశుసంపదకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుందిఇవి మన పశుపోషకుల భవిష్యత్తును మెరుగుపరచేందుకు ఎంతో ఉపయోగపడతాయిబంజరు భూమిని పచ్చిక బయళ్లుగా మారుస్తూ ఆర్థిక సహాయ పథకాలతోపాటు దేశీయ జాతులను రక్షించడానికి జాతీయ పశుసంవర్ధక మిషన్‌కు సవరణలు ప్రవేశపెట్టాం.  పశువుల బీమా  ప్రీమియం మొత్తాన్ని తగ్గించాలన్న నిర్ణయం తీసుకున్నాంఇది పశువుల పెంపకందారులపై ఆర్థిక భారం తగ్గించిపశువుల సంఖ్యను పెంచడంలోవారి ఆదాయాన్ని మెరుగుపరచడంలో సహయపడుతుంది.

మిత్రులారా!

 గుజరాత్ ప్రజలమైన మనకు నీటి కొరత గురించి బాగా తెలుసుసౌరాష్ట్రకచ్ఉత్తర గుజరాత్ వంటి ప్రాంతాల్లో ఎండలుకరువు సమయంలో నీటి కోసం మైళ్ల కొద్దీ తిరిగే జంతువులను మనం చూశాంనీరు లేక చనిపోయిన జంతువుల హృదయ విదారక దృశ్యాలు మన మనసులను కదిలించాయినర్మదా జలాలు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల పరిస్థితి మారిపోయిందిభవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు మేము సంకల్పించాంఈ లక్ష్యంతోనే మా ప్రభుత్వం ఇప్పటివరకు 60 వేలకుపైగా అమృత్ సరోవర్ల నిర్మాణం చేపట్టిందిఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుందిగ్రామాల్లోని చిన్న రైతులకు ఆధునిక సాంకేతికత అందించాలన్నదే మా ప్రయత్నం ధ్యేయంగుజరాత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా సూక్ష్మ సేద్యం,  బిందు సేద్యం పద్ధతుల వినియోగం గణనీయంగా పెరిగిందిబిందు సేద్యం కోసం రైతులకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతోందిరైతులకు శాస్త్రీయ పరిష్కారాలను చేరువ చేయాలనే ఉద్దేశంతో కిసాన్ సమృద్ధి కేంద్రాలను గ్రామాల సమీపాల్లో ఏర్పాటు చేశాం.  సేంద్రీయ ఎరువుల తయారీలో రైతులు భాగస్వామ్యం అయ్యేందుకు అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తున్నాం.

మిత్రులారా!

మా ప్రభుత్వం అన్నదాతలైన రైతులనులను ఉర్జాదాతలుగా అంటే శక్తిఎరువులను అందించే వ్యక్తులుగా మార్చే దిశగా కృషి చేస్తోందిఈ లక్ష్యంతో రైతులకు సౌరశక్తితో పనిచేసే పంపులను పంపిణీ చేస్తున్నాంవారి పొలాలలో చిన్న సౌర ప్లాంట్ల ఏర్పాటుకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నాంగోబర్‌ధన్‌ యోజన కింద పశువుల పెంపకందారుల నుంచి ఆవు పేడను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయిమన పాడి పరిశ్రమలలో ఆవు పేడ నుంచి విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోందిఈ ప్రక్రియలో తయారయ్యే సేంద్రీయ ఎరువులు రైతులకు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్నాయిఈ  కార్యక్రమం ద్వారా రైతులుపశుపోషకులు ఇద్దరూ ప్రయోజనం పొందడమే కాకుండా వ్యవసాయ క్షేత్రాలలో నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందిబనస్కాంతలో అముల్ ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్ ఈ దిశగా ఒక గొప్ప ముందడుగు.

మిత్రులారా

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగ పాత్రను గణనీయంగా విస్తరిస్తున్నాంకేంద్ర స్థాయిలో తొలిసారిగా ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాంప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షలకుపైగా గ్రామాల్లో సహకార సంఘాలు ఏర్పడుతున్నాయి. ‘మేడ్ ఇన్ ఇండియా’ కింద వ్యవసాయంపశుపోషణమత్స్యవ్యవసాయంతయారీ రంగాలలో కూడా ఈ కమిటీలు ఏర్పాటవుతున్నాయి.ఇలాంటి సహకార సంఘాలకు గణనీయమైన పన్ను రాయితీలను కూడా కల్పించాందీని వలన వాటి ఆర్థిక సామర్థ్యం మరింత పెరుగుతోందిఅంతేకాక చిన్న రైతుల కోసం రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాంఇప్పటికే 10,000 ఎఫ్‌పీఓలలో సుమారు 8000 స్థాపించాంఈ సంస్థలు చిన్న రైతులకు ముఖ్యమైన వేదికలుగా పనిచేస్తాయివారిని ఉత్పత్తిదారులువ్యవసాయ వ్యవస్థాపకులుఎగుమతిదారులుగా మార్చడంలో దోహదపడతాయిప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలుఎఫ్‌పీఓలుఇతర సహకార సంఘాలకు మా ప్రభుత్వం గణనీయ ఆర్థిక సహాయాన్ని అందిస్తోందిగ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని కేటాయించాందీనివల్ల రైతుల సహకార సంస్థలు కూడా లాభపడుతున్నాయి.

మిత్రులారా,

పశుపోషణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో మన ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతోందిదీని కోసం రూ. 30 వేల కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాంఅదనంగా పాడి సహకార సంస్థలకు వడ్డీ  రాయితీలను పెంచడానికి కూడా ఏర్పాట్లు చేశాంఇది ఈ సంస్థల ఆర్థిక భారం తగ్గించడంలో ఎంతో దోహదపడుతోందిపాడి పరిశ్రమల ఆధునీకరణ కోసం భారీగా నిధులు కేటాయించాంఈ క్రమంలో సబర్కంథ మిల్క్ యూనియన్ పరిధిలో రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేశాంవీటిలో రోజుకు 800 టన్నుల పశుగ్రాసం ఉత్పత్తి చేయగల ఆధునిక ప్లాంట్ కూడా ఉంది.

సోదరీసోదరులారా!

అభివృద్ధి చెందిన భారత్‌ గురించి మాట్లాడే సందర్భంలో.. ప్రతి ఒక్కరి కలిసికట్టైన ప్రయత్నాలను నేను దృఢంగా నమ్ముతానుస్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2017 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పించిందిఅమూల్ కూడా తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోందిఈ సందర్భంగా నేడు మీరు కొత్త సంకల్పాలతో బయలుదేరాలని నేను మీ అందరినీ కోరుతున్నానుమన దేశ జనాభా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి పోషకాహారాన్ని అందించడంలో మీరు నిర్వహించే పాత్ర ఎంతో కీలకంవచ్చే ఐదేళ్లలో మీ ప్లాంట్ల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే మీ లక్ష్యం గురించి నాకు తెలుసుదీని గురించి నిశ్చింతగా ఉండండిఈ మార్గంలో మీరు వేస్తున్న ప్రతి అడుగులో ప్రభుత్వం అండగా ఉంటుందిమా నుంచి పూర్తి మద్దతు అందుతుందిఇది మోదీ అందిస్తున్న హామీప్రస్తుతం అమూల్ ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డెయిరీ సంస్థగా ఉందిఇది ప్రపంచంలోనే నంబర్ డెయిరీ సంస్థగా మారాలన్నదే మన సంకల్పంఅమూల్ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకొని చారిత్రక ప్రస్థానాన్ని సాధించినందుకు  మరోసారి అందరికీ అభినందనలు!

ధన్యవాదాలు!

 

***


(Release ID: 2169547) Visitor Counter : 4