ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సాయుధ దళాల సర్వసన్నద్ధత కోసం కలసికట్టుతనం, ఆత్మనిర్భరత, ఆవిష్కరణల

అవసరం ఉందన్న ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ

కోల్ కతాలో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో పీఎం

Posted On: 15 SEP 2025 3:34PM by PIB Hyderabad

కోల్ కతాలో ఈ రోజు జరిగిన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారురెండేళ్లకోసారి జరిగే ఈ సమావేశాన్ని సాయుధ దళాల అత్యున్నత స్థాయి మేధోమథన వేదికగా పరిగణిస్తారుఇది దేశంలోని అగ్రశ్రేణి పౌరసైనిక నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తుందిపరస్పరం అభిప్రాయాలను పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుందిభారత సైనిక సన్నద్ధతను మరింత మెరుగుపరిచేందుకు క్షేత్రస్థాయి కార్యాచరణను అందిస్తుందిసాయుధ దళాల ప్రస్తుత ఆధునికీకరణమార్పులకు అనుగుణంగా 'సంస్కరణల సంవత్సరం భవిష్యత్తు కోసం మార్పు‘  అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి

ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో పాటు దేశ నిర్మాణంపైరసీ నిరోధంసంఘర్షణ ప్రాంతాల నుంచి  భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో పాటు మిత్ర దేశాలకు మానవతా సహాయంవిపత్తు ఉపశమన (హెచ్ఏడీఆర్సహాయాన్ని అందించడంలో సాయుధ దళాలు పోషించిన సమగ్ర పాత్రను ప్రధానమంత్రి అభినందించారు. 2025వ సంవత్సరాన్ని రక్షణ రంగంలో 'సంస్కరణల సంవత్సరంగా పరిగణిస్తున్న సందర్భంలోభవిష్యత్తు సవాళ్ళను,  ఎలాంటి  పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మరింత కలసికట్టుతనంఆత్మనిర్భరతఆవిష్కరణల సాధనలో స్పష్టమైన చర్యలను వేగంగా అమలు చేయాలని రక్షణ మంత్రిత్వశాఖను ప్రధానమంత్రి ఆదేశించారు.

ఆపరేషన్ సిందూర్ సృష్టించిన కొత్త పరిస్థితుల నేపథ్యంలో బలగాల కార్యాచరణ సంసిద్ధతఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతవ్యూహాల నేపథ్యంలో భవిష్యత్ యుద్ధ రంగం గురించి ఈ సందర్భంగా అధికారులు ప్రధానమంత్రికి వివరించారుగడచిన రెండేళ్ళలో అమలు పరచిన సంస్కరణలనురాబోయే రెండేళ్ల ప్రణాళికను కూడా ప్రధానమంత్రి సమీక్షించారు.

వివిధ బలగాల నుంచి వచ్చిన సమాచారంపెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి నేపథ్యంలో సాయుధ దళాలకు సంసిద్ధత అవసరం అన్న ఆధారంగా వివిధ నిర్మాణాత్మకపరిపాలనకార్యాచరణ అంశాలపై రాబోయే రెండు రోజులలో ఈ సమావేశం సమగ్ర సమీక్షను నిర్వహిస్తుందిఅలాగే ప్రధానమంత్రి దార్శనికతను అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించే చర్చలు కూడా జరుగుతాయి

 

***


(Release ID: 2166992) Visitor Counter : 2