ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మిజోరాంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

Posted On: 13 SEP 2025 12:26PM by PIB Hyderabad

మిజోరాం గవర్నర్ వికెసింగ్ గారుముఖ్యమంత్రి శ్రీ లాల్ దుహోమా గారుకేంద్ర మంత్రివర్గ సహచరుడు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారుమిజోరాం ప్రభుత్వ మంత్రులుఎంపీలుఇతర ప్రజా ప్రతినిధులుమిజోరాం అశేష ప్రజానీకానికి శుభాకాంక్షలు.

అందమైన ఈ నీలి పర్వత క్షేత్రాన్ని కాపాడుతున్న సర్వోన్నతుడైన దేవుడు పతియన్‌కు నమస్కరిస్తున్నానునేనిక్కడ మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో ఉన్నానుదురదృష్టవశాత్తు వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఐజ్వాల్‌లో మీ మధ్య లేనందుకు చింతిస్తున్నానుకానీ ఈ మాధ్యమం నుంచి కూడా మీ ప్రేమాదరాలను నేను ఆస్వాదిస్తున్నాను.

మిత్రులారా,

స్వతంత్రోద్యమమయినాదేశ నిర్మాణమయినా.. మిజోరాం ప్రజలు ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలిచారులాల్ను రోపులియానిపసల్తా ఖువాంగ్‌చేరా వంటి వ్యక్తుల ఆదర్శాలు దేశానికి ఉత్తేజాన్నిస్తూనే ఉన్నాయిత్యాగం సేవధైర్యం కరుణ.. ఈ విలువలే మిజో సమాజానికి కేంద్రబిందువుగా ఉన్నాయినేడు భారత అభివృద్ధి ప్రస్థానంలో మిజోరాం ముఖ్య పాత్ర పోషిస్తోంది.

మిత్రులారా,

ఇది దేశానికిముఖ్యంగా మిజోరాం ప్రజలకు చరిత్రాత్మకమైన రోజుదేశ రైల్వే పటంలో నేటి నుంచి ఐజ్వాల్ కూడా ఉంటుందికొన్ని సంవత్సరాల కిందట ఐజ్వాల్ రైల్వే మార్గానికి శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించిందినేడు దానిని సగర్వంగా దేశ ప్రజలకు అంకితం చేస్తున్నాంకఠినమైన భూభాగం వంటి అనేక సవాళ్లను అధిగమించి.. ఈ బైరాబి సైరంగ్ రైల్వే లైన్ సాకారమైందిమన ఇంజినీర్ల నైపుణ్యాలుమన కార్మికుల స్ఫూర్తి వల్లే ఇది సాధ్యమైంది.

మిత్రులారా,

మన హృదయాలు ఎల్లప్పుడూ అనుసంధానమయ్యే ఉన్నాయిఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్ తొలిసారిగా మిజోరాంలోని సైరంగ్‌ను ఢిల్లీతో నేరుగా అనుసంధానిస్తోందిఇది కేవలం రైల్వే అనుసంధానమే కాదు.. పరివర్తనకు జీవనాడిఇది మిజోరాం ప్రజల జీవితాల్లోజీవనోపాధిలో విప్లవాత్మక మార్పులు తెస్తుందిమిజోరాం రైతులువ్యాపారులు దేశవ్యాప్తంగా మరిన్ని మార్కెట్లను చేరుకోగలరువిద్యఆరోగ్య సంరక్షణపరంగా ప్రజలకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయిదీని వల్ల పర్యాటకంరవాణాఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

మిత్రులారా,

మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తున్నాయివాటి దృష్టి ఎప్పుడూ ఎక్కువ ఓట్లుసీట్లు ఉన్న ప్రాంతాలపైనే ఉంటుందిఈ వైఖరి వల్ల మిజోరాం వంటి రాష్ట్రాలు సహా ఈశాన్య ప్రాంతం మొత్తం తీవ్రంగా నష్టపోయిందికానీ మా విధానం అందుకు చాలా భిన్నమైనదిగతంలో నిర్లక్ష్యానికి గురైనవారు ఇప్పుడు ముందంజలో నిలిచారుఒకప్పుడు అణచివేతను ఎదుర్కొన్న వారు ఇప్పుడు ప్రధాన స్రవంతిలో ఉన్నారుగత 11 సంవత్సరాలుగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం మేం కృషి చేస్తున్నాంఈ ప్రాంతం దేశ అభివృద్ధి చోదకంగా మారుతోంది.

మిత్రులారా,

గత కొన్ని సంవత్సరాలుగా పలు ఈశాన్య రాష్ట్రాలు తొలిసారిగా దేశ రైల్వే వ్యవస్థలో చోటు దక్కించుకున్నాయిగ్రామీణ ప్రాంతాల్లో రోడ్లుహైవేలుమొబైల్ సదుపాయాలుఇంటర్నెట్ కనెక్షన్లువిద్యుత్తుకుళాయి నీరుఎల్పీజీ కనెక్షన్లను పొందాయిఅన్ని రకాలుగా అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం అమితంగా కృషి చేసిందివిమాన ప్రయాణానికి ఉద్దేశించిన ఉడాన్ పథకం ద్వారా కూడా మిజోరాం రాష్ట్రానికి ప్రయోజనం కలగనుందిత్వరలోనే ఇక్కడ హెలికాప్టర్ సేవలు ప్రారంభమవుతాయిఇది మిజోరాంలోని మారుమూల ప్రాంతాలకు రాకపోకలను మెరుగుపరుస్తుంది.

మిత్రులారా,

మన ‘యాక్ట్ ఈస్ట్’ విధానంప్రస్తుత నార్త్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ రెండింటిలోనూ మిజోరాం ప్రధాన పాత్ర పోషిస్తుందికళాదాన్ బహువిధ ఎగుమతి రవాణా ప్రాజెక్టుసైరంగ్‌హ్మాంగ్ బుచువా రైల్వే లైన్‌లతో.. ఆగ్నేయాసియా ద్వారా బంగాళాఖాతంతో కూడా మిజోరాం అనుసంధానమవుతుందిదీనివల్ల ఈశాన్య భారతంఆగ్నేయాసియా ప్రాంతంలో వాణిజ్యంపర్యాటకం అభివృద్ధి చెందుతాయి.

మిత్రులారా,

మిజోరాం ప్రతిభావంతులైన యువత పుష్కలంగా ఉన్నారువారిని సాధికారులను చేయడమే మా లక్ష్యంమా ప్రభుత్వం ఇప్పటికే ఇక్కడ 11 ఏకలవ్య ఆవాస పాఠశాలలను ప్రారంభించిందిమరో పాఠశాలలను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాంఅంకుర సంస్థల ప్రధాన కేంద్రంగా కూడా మన ఈశాన్య ప్రాంతం ఎదుగుతోందిదాదాపు 4,500 అంకుర సంస్థలు25 ఇంక్యుబేటర్లు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తుండడం సంతోషాన్నిస్తోందిమిజోరాం యువత ఈ ఉద్యమంలో క్రియాశీలంగా భాగస్వాములవుతూ.. తమతోపాటు ఇతరులకూ కొత్త అవకాశాలను అందిస్తున్నారు.

మిత్రులారా,

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన క్రీడా కేంద్రంగా భారత్ శరవేగంగా ఎదుగుతోందిఇది దేశంలో క్రీడా సంబంధిత ఆర్థిక వ్యవస్థను కూడా సృష్టిస్తోందిఅద్భుతమైన క్రీడా సంప్రదాయం మిజోరాం సొంతంఫుట్‌బాల్ఇతర క్రీడల్లో చాలా మంది ఛాంపియన్‌లను అందిస్తోందిమా క్రీడా విధానాలు మిజోరాంకు కూడా ప్రయోజనం చేకూరుస్తున్నాయిఖేలో ఇండియా పథకం కింద ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు మేం చేయూతనిస్తున్నాంఇటీవల మా ప్రభుత్వం ఖేలో ఇండియా ఖేల్ నీతి అనే జాతీయ క్రీడా విధానాన్ని కూడా రూపొందించిందిఇది మిజోరాం యువతకు కొత్త అవకాశాలను అందిస్తుంది.

మిత్రులారా,

మన దేశంలో అయినావిదేశాల్లో అయినా.. అందమైన ఈశాన్య ప్రాంత సంస్కృతికి ప్రతినిధిగా ఉండడం నాకు చాలా ఆనందాన్నిస్తుందిఈశాన్య ప్రాంత సమర్థతను చాటే వేదికలను ప్రోత్సహించడం చాలా ముఖ్యంకొన్ని నెలల కిందట ఢిల్లీలో జరిగిన అష్టలక్ష్మి ఉత్సవంలో పాల్గొనే అవకాశం నాకు లభించిందిఇది ఈశాన్య ప్రాంత వస్త్రాలుచేతిపనులుజీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులుపర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించిందిఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని రైజింగ్ నార్త్ ఈస్ట్ సదస్సులో నేను పెట్టుబడిదారులకు పిలుపునిచ్చానుఈ సదస్సు భారీగా పెట్టుబడులుప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తోందిస్థానిక ఉత్పత్తులను ఆదరిద్దామని నేను చెప్తూ వస్తున్నానుఇది ఈశాన్య ప్రాంత కళాకారులురైతులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందిమిజోరాం వెదురు ఉత్పత్తులుసేంద్రియ అల్లంపసుపుఅరటి అత్యంత ప్రసిద్ధి చెందాయి.

మిత్రులారా,

జీవన సౌలభ్యాన్నివాణిజ్య సౌలభ్యాన్ని పెంచడం కోసం మేం నిరంతరం చర్యలు తీసుకుంటున్నాంఇటీవలే సమగ్ర జీఎస్టీ సంస్కరణలను ప్రకటించాందీని ద్వారా అనేక ఉత్పత్తులపై పన్నులు తగ్గుతాయిఇది కుటుంబాలకు జీవనాన్ని సులభతరం చేస్తుంది2014కు ముందు టూత్‌పేస్టుసబ్బునూనె వంటి నిత్యావసర వస్తువులపై కూడా 27 శాతం పన్ను విధించేవారునేడు వాటికి కేవలం శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందికాంగ్రెస్ పాలనలో ఔషధాలుపరీక్ష కిట్లుబీమా పాలసీలపై భారీగా పన్ను విధించేవారుఅందుకే ఆరోగ్య సంరక్షణ ఖరీదైనదిగా మారిందిసాధారణ కుటుంబాలకు బీమా అందుబాటులో లేదుఇవన్నీ అందుబాటులోకి వచ్చాయికొత్త జీఎస్టీ రేట్లతో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు ఔషధాలు మరింత చవకగా మారతాయిసెప్టెంబర్ 22 తర్వాత సిమెంటునిర్మాణ సామగ్రి కూడా చవకగా మారతాయిచాలా స్కూటర్లుకార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించాయిఈ సారి పండుగ సీజన్ దేశవ్యాప్తంగా మరింత ఉత్సాహంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను.

మిత్రులారా,

సంస్కరణల్లో భాగంగా చాలా హోటళ్లపై జీఎస్టీని కేవలం శాతానికే తగ్గించారువివిధ ప్రదేశాలకు ప్రయాణంహోటళ్లలో బసబయట తినడం చవకగా మారతాయిఇది ఎక్కువ మంది మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడానికిఆస్వాదించడానికి సహాయపడుతుందిముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల వంటి పర్యాటక కేంద్రాలకు దీని ద్వారా విశేష ప్రయోజనం కలుగుతుంది.

మిత్రులారా,

2025-26 మొదటి త్రైమాసికంలో మన ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని సాధించిందిఅంటే భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థమేకిన్ ఇండియాలోఎగుమతుల్లో అభివృద్ధిని కూడా చూస్తున్నాంఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మన సైనికులు ఎలా గుణపాఠం నేర్పారో ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరంతా చూశారుమన సాయుధ దళాల పట్ల యావద్దేశమూ గర్వంతో నిండిపోయిందిఈ ఆపరేషన్‌లో భారత్‌లో తయారైన ఆయుధాలు మన దేశ రక్షణలో గణనీయమైన పాత్ర పోషించాయిమన ఆర్థిక వ్యవస్థతయారీ రంగం అభివృద్ధి దేశ భద్రతకు అత్యంత కీలకమైనది.

మిత్రులారా,

ప్రతి పౌరుడుప్రతి కుటుంబంప్రతి ప్రాంతం సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందిప్రజల సాధికారత ద్వారానే అభివృద్ధి చెందిన భారత్ సాకారమవుతుందిఈ ప్రయాణంలో మిజోరాం ప్రజలు అత్యంత కీలక పాత్ర పోషిస్తారన్న నమ్మకం నాకుందిమరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూభారత రైల్వే వ్యవస్థలోకి ఐజ్వాల్‌కు స్వాగతం పలుకుతున్నానుఈరోజు వాతావరణం సరిగా లేకపోవడం వల్ల నేను ఐజ్వాల్‌కు రాలేకపోయానుకానీ త్వరలోనే మనం కలుస్తామని భావిస్తున్నాను.

ధన్యవాదాలు

 

***


(Release ID: 2166442) Visitor Counter : 5