ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌... కోల్‌కతాలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం ప్రధానమంత్రి ఇంగ్లిషు ప్రసంగానికి తెలుగు అనువాదం

प्रविष्टि तिथि: 22 AUG 2025 6:45PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్‌ గవర్నరు సీవీ ఆనంద్ బోస్ గారుకేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శాంతను ఠాకుర్ గారురవ్‌నీత్ సింగ్ గారుసుకాంత మజుమ్దార్ గారుపశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి గారుపార్లమెంటులో నా సహచరుడు షోమిక్ భట్టాచార్య గారుఇక్కడున్న ఇతర ప్రజాప్రతినిధులుమహిళలుసజ్జనులారా,

అభివృద్ధి పథంలో పశ్చిమ బెంగాల్ శరవేగంగా దూసుకుపోయేలా చేసే మరో అవకాశం ఈ రోజు నాకు లభించిందికాసేపటి కిందటే నేను నౌపారా నుంచి జై హింద్ బిమాన్ బందర్ వరకు కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన అనుభూతిని పొంది వచ్చానిక్కడికిఈ ప్రయాణంలోచాలా మంది మిత్రులతో ముచ్చటించే అవకాశం నాకు దక్కిందికోల్‌కతాలో ప్రజా రవాణా నిజంగా కొత్త రూపాన్ని సంతరించుకోవడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోందిఈ రోజేఇక్కడ ఆరు మార్గాల ఎలివేటెడ్ కోనా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన పూర్తయిందివేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులన్నింటికి  కోల్‌కతా వాసులతో పాటు పూర్తి పశ్చిమ బెంగాల్ ప్రజానీకానికి అనేకానేక అభినందనలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

కోల్‌కతా వంటి మన నగరాలు భారత్ చరిత్రతో పాటు మన భవిష్యత్తు.. ఈ రెండింటి ఘనమైన గుర్తింపునకు చిహ్నాలుగా నిలుస్తున్నాయిఈ రోజు మన దేశం.. ప్రపంచంలోనే మూడో అతి పెద్దదైన ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పయనిస్తోందంటే ఇందులో ఢమ్‌ఢమ్కోల్‌కతా వంటి నగరాల పాత్ర ఎంతో ఉందిఅందువల్లఈ నాటి ఈ కార్యక్రమం అందిస్తున్న సందేశం మెట్రో ప్రారంభోత్సవంతో పాటు హైవేకు శంకుస్థాపనే కాక అంతకు మించింది కూడాఈ కార్యక్రమం భారత్ తన నగరాల రూపురేఖల్ని ఎలా తీర్చిదిద్దుకుంటోందో అనే దానికి ఒక నిదర్శనంగా నిలుస్తోందిఇవాళభారతీయ నగరాల్లో కాలుష్య రహిత రాకపోకల నిర్వహణకు ప్రయత్నాలు సాగుతున్నాయివిద్యుత్తు బస్సులతో పాటు విద్యుత్తు చార్జింగ్ కేంద్రాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందిచెత్తను సంపదగా మార్చేందుకూనగరం నుంచే కాక మెట్రో సదుపాయాల నుంచి వస్తున్న చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకూ కృషి చేస్తున్నారుమెట్రో పరిధిని నానాటికీ విస్తరిస్తున్నారుప్రస్తుతం ప్రపంచంలో మూడో అతి పెద్ద మెట్రో వ్యవస్థ భారత్‌లో ఏర్పాటైందని తెలుసుకొంటే ప్రతి ఒక్కరు సంతోషపడతారు. 2014కు ముందుదేశంలో మెట్రో రూట్ 250 కిలోమీటర్లే ఉందిఇవాళ దేశంలో మెట్రో రూట్ ఒక వేయి కి.మీకంటే పొడవైందిగా మారిపోయిందికోల్‌కతాలోనూ మెట్రో కూడా విస్తరిస్తోందిఈ  రోజున కూడాదాదాపు 14 కి.మీ మేర కొత్త లైన్లను కోల్‌కతా మెట్రో రైల్ వ్యవస్థకు జోడిస్తున్నారు. 7 కొత్త స్టేషన్లను కోల్‌కతా మెట్రోకు కలుపుతున్నారుఈ పనులన్నీ కోల్‌కతా ప్రజల ప్రయాణ సౌలభ్యంతో పాటు జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచబోతున్నాయి.  

మిత్రులారా,

ఇరవై ఒకటో శతాబ్ది భారతదేశానికి ఇరవై ఒకటో శతాబ్దానికి తగిన రవాణా వ్యవస్థ అవసరంఈ కారణంగానే  మేం దేశంలో రైలుమార్గం మొదలు రోడ్డు మార్గం వరకుమెట్రో మొదలు విమానాశ్రయం వరకు.. ఆధునిక రవాణా సదుపాయాల్ని అభివృద్ధి చేస్తున్నాంఅంతేకాకవాటిని ఒకదానితో మరోదానిని కలుపుతున్నాం కూడాప్రజలను ఒక నగరం నుంచి మరో నగరానికి చేరవేయడంతో పాటువారి ఇళ్ల వరకు ఎలాంటి అసౌకర్యం లేకండా రవాణాను సమకూర్చాలన్నది మా ప్రయత్నంమరి మనం ఇక్కడ.. కోల్‌కతాలో.. బహుళ విధ సంధానం తాలూకు ఛాయలను కూడా చూడొచ్చుఎలాగంటే ఇవాళ హావ్‌డాసియాల్దహ్ వంటి దేశంలోని అన్నింటి కన్నా రద్దీగా ఉండే  రైల్వేస్టేషన్ ఇప్పుడు మెట్రోతో కలిసిపోయాయిదీనర్థం.. ఇంతకు ముందు ఏ స్టేషన్ల మధ్య ప్రయాణానికి గంటన్నర పట్టేదోదానికి ఇప్పుడు మెట్రో ద్వారా కేవలం కొన్ని నిమిషాలయితే సరిపోతుందిఇదే విధంగాహావ్‌డా స్టేషన్ సబ్‌వే కూడా బహుళ విధ సంధానానికి అనుకూలంగా మారిందిఇదివరకుఒక వ్యక్తికి ఈశాన్య రైల్వేకు చెందిన ఒక రైలును అందుకోవాలంటే చాలా చుట్టు ప్రయాణం చేయాల్సివచ్చేదిఈ రోజు నుంచీకోల్‌కతా విమానాశ్రయాన్ని కూడా మెట్రోకు జోడించారుఅంటే... నగరంలో సుదూర ప్రాంతాల నుంచీ విమానాశ్రయానికి చేరుకోవాలంటే చాలా సులభం.

మిత్రులారా,

పశ్చిమ బెంగాల్ పురోగతికి కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాలనూ చేస్తోందిఈ రోజునపూర్తి విద్యుదీకరణ సమకూరిన రాష్ట్రాల సరసన పశ్చిమ బెంగాల్ నిలిచిందిపురులియాకుహావ్‌డాకు మధ్య ‘మెమూ’ రైలు కావాలని ప్రజలు చాలా కాలం నుంచీ కోరుతున్నారుప్రజల కోరికను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందిఈ రోజునపశ్చిమ బెంగా‌ల్‌లో వేర్వేరు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయిదీనికి తోడుమీ అందరి కోసం అమృత్ భారత్ రైళ్లు కూడా నడుస్తున్నాయి.

మిత్రులారా,

గత 11 సంవత్సరాల్లోఇక్కడ అనేక హైవే ప్రాజెక్టుల్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందిమరెన్నో ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయిఆరు లైన్ల కోనా ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి అయితేదాంతో రేవుకు సంధాన సదుపాయం మెరుగుపడుతుందిఈ సంధానం కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్ భవిష్యత్తుకు సంబంధించిన పునాదిని పటిష్ఠపరుస్తుందిఇప్పటికి ఇంతే.

మిత్రులారా,

మరి కాసేపట్లోదగ్గర్లోనే ఒక బహిరంగ సభ జరగబోతోందిఆ  సమావేశంలోపశ్చిమ బెంగాల్ అభివృద్ధిపశ్చిమ బెంగాల్ భవిష్యత్తు అనే అంశాలపై మీ అందరితో చర్చిస్తానుఇంకా అనేకం కూడా చోటుచేసుకోబోతున్నాయికాబట్టి అక్కడ ఎంతో మంది వేచి ఉన్నారునేను నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను.

మీకందరికీ శుభాకాంక్షలుమీకు ధన్యవాదాలు. ‌

 

***


(रिलीज़ आईडी: 2160826) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam