ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సర్ గంగారాం ఆసుపత్రిలో శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించిన ప్రధాని

Posted On: 04 AUG 2025 2:17PM by PIB Hyderabad

శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించేందుకు సర్ గంగారాం ఆసుపత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు.

ఎక్స్ ‌లో చేసిన వేర్వేరు పోస్టుల్లో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించడానికి సర్ గంగారాం ఆసుపత్రికి వెళ్లాను. ఆయన కుటుంబాన్ని పరామర్శించాను. హేమంత్, కల్పనతో పాటు శ్రీ శిబు సోరెన్ అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.

@HemantSorenJMM

@JMMKalpanaSoren”

‘‘జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు శ్రద్ధాంజలి ఘటించాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి నా సంతాపాన్ని వ్యక్తం చేశాను. ఆయన తన జీవితాన్ని గిరిజన సమాజ సంక్షేమానికి అంకితం చేశారు. ఈ విషయంలో ఆయన ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా నిలిచిపోతారు.

@HemantSorenJMM

@JMMKalpanaSoren”


(Release ID: 2152096)