ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హరిద్వార్‌లో తొక్కిసలాటలో జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని

प्रविष्टि तिथि: 27 JUL 2025 12:39PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట కారణంగా ప్రాణ నష్టం జరగటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

"ఉత్తరాఖండ్‌కు చెందిన హరిద్వార్‌లోని మానస దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట కారణంగా ప్రాణనష్టం జరగటం తీవ్ర విచారకరం. ప్రియతములను కోల్పోయిన వాళ్లకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు సహాయం అందిస్తోంది: ప్రధానమంత్రి"


(रिलीज़ आईडी: 2149156) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam