ప్రధాన మంత్రి కార్యాలయం
కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
26 JUL 2025 8:46AM by PIB Hyderabad
కార్గిల్ విజయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు “దేశ ప్రతిష్ఠ పరిరక్షణలో జీవితాలను త్యాగం చేసిన భరతమాత సాహపుత్రుల అసమాన శౌర్యపరాక్రమాలను సర్మించుకోవాల్సిన సందర్భమిది” అని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. మాతృభూమి ఆత్మగౌరవ పరిరక్షణలో జీవితాన్నే పణంగా పెట్టిన భరతమాత సాహస పుత్రుల అకుంఠిత దీక్ష, శౌర్యపరాక్రమాలను ఈ రోజున మన స్ఫురణకు వస్తాయి. జన్మభూమి కోసం ప్రాణార్పణకు వెనుదీయని వారి దేశభక్తి తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. జై హింద్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 2148808)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam