ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల

Posted On: 25 JUL 2025 9:08PM by PIB Hyderabad

భారత్మాల్దీవుల దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీమాల్దీవులు అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజు స్మారక స్టాంపులను విడుదల చేశారు.

రెండు దేశాల మధ్యనున్న దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధాలను తెలియజేసేలా ఈ స్మారక స్టాంపులు కేరళలోని బేపూర్‌ చారిత్రక పడవ కేంద్రంలో చేతితో తయారు చేసిన పెద్ద చెక్క ఓడ అయిన ‘ఉరు’ అనే భారతీయ పడవను, చేపలు పట్టటానికి ఉపయోగించే సంప్రదాయ మాల్దీవుల పడవ అయిన ‘వధు ధోని’ని కలిగి ఉన్నాయిఈ పడవలు శతాబ్దాలుగా హిందూ మహాసముద్ర వాణిజ్యంలో భాగంగా ఉన్నాయి. ‘వధు ధోని’ని తీరప్రాంతాలుసముద్ర దిబ్బల్లో చేపలు పట్టేందుకు ఉపయోగిస్తారుసముద్రాల విషయంలో మాల్దీవుల సాంస్కృతిక వారసత్వం.. ద్వీప జీవనంసముద్రం మధ్యనున్న సన్నిహిత బంధాన్ని ఇది తెలియజేస్తుంది.

 

1965లో మాల్దీవులకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశాల్లో భారత్ ఒకటిఈ స్మారక స్టాంపులు రెండు దేశాల మధ్య సన్నిహితచారిత్రక సంబంధాలను సూచిస్తాయి.

 

***


(Release ID: 2148769)