నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వర్షాకాల సమావేశాల తొలిరోజే ‘బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025’ బిల్లుకు పార్లమెంటు ఆమోదం


169 ఏళ్లనాటి కాలం చెల్లిన నౌకాయాన చట్టం స్థానంలో కొత్త చట్టం

చారిత్రాత్మక నౌకాయాన సంస్కరణలకు రాజ్యసభ ఆమోదం తెలిపిన సందర్భంలో ‘బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025’ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్

2025 మార్చి నెలలో ‘బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025’ బిల్లుకు లోక్ సభ ఆమోదంతో రాష్ట్రపతి ఆమోదానికి మార్గం సుగమం
రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే “ద బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025” బిల్లు

కాలం చెల్లిన వలస చట్టాల స్థానంలో ఆధునిక చట్టాలు తేవడం కీలక ముందడుగు: కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్

प्रविष्टि तिथि: 21 JUL 2025 6:47PM by PIB Hyderabad

వర్షాకాల సమావేశాల తొలి రోజునే ‘బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిందిదీంతో రాష్ట్రపతి ఆమోదానికి మార్గం సుగమం అయిందికేంద్ర నౌకాశ్రయాలునౌకాయానంజలరవాణా మంత్రి (మ్ఓపీఎస్‌డబ్ల్యూసర్బానంద సోనోవాల్ ఈరోజు ఎగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారుఇది భారత సముద్ర రంగంలో ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.

లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లు చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉంది. 169 ఏళ్లనాటి వలసచట్టమైన ఇండియన్ ల్యాండింగ్ యాక్ట్-1856 స్థానంలో భారత సముద్ర షిప్పింగ్ డాక్యుమెంటేషన్ కోసం ఆధునికమైనసరళీకృతమైనప్రపంచానికి అనుగుణంగా ఉండే ఈ చట్టపరమైన విధానం అమలులోకి రానుంది.

బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. మన దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన అంటే వికసిత్ భారత్‌గా మార్చాలనే అత్యున్నత దార్శనికతను రూపొందించిన మన దార్శనికులుచైతన్యవంతులైన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఈనాటి మన సమావేశం సందర్భంగా మనం గుర్తుచేసుకుంటున్నాంఈ దార్శనికత కేవలం ఆకాంక్షాత్మకమైనది మాత్రమే కాదుఇది కొత్తసుసంపన్న భారత్ వాగ్దానంతో మన ప్రయత్నాలనుఆకాంక్షలను అనుసంధానించాలని పిలుపునిస్తుందిగౌరవనీయ ప్రధానమంత్రి మాటల్లో.. 'భారత్ తన వ్యవస్థలను సంస్కరించడానికిదాని భవిష్యత్తును మార్చడానికి వేగంగాగొప్ప స్థాయితో ముందుకుసాగాలి” అని వ్యాఖ్యానించారు.

ఈ కొత్త చట్టం పురాతన నిబంధనల స్థానంలో స్పష్టమైనవ్యాపార అనుకూలమైన భాషను కలిగి ఉంటుందిక్యారియర్లుషిప్పర్లుచట్టబద్ధత గల హోల్డర్ల హక్కులుబాధ్యతలను క్రమబద్ధీకరిస్తుందిషిప్పింగ్ డాక్యుమెంటేషన్‌లో అస్పష్టతను తగ్గించడం ద్వారా వ్యాజ్యాల ముప్పును తగ్గిస్తుందిఅలాగే అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలోమన పురోగతికి ఆటంకం కలిగించే వలసవాదరాజ్యాంగ పూర్వ వారసత్వాల అవశేషాలను వదిలించుకునేందుకు ఇది సరైన సమయం. ‘స్వర్ణిమ్ భారత్’ సాకారం కోసం సమకాలీనమైనమన దేశ పౌరులు రూపొందించినఆధునిక యుగ సవాళ్లను పరిష్కరించగల ఒక చట్టం అవసరం” అని సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు.

కాలం చెల్లిన గత చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం అమలులోకి రానుందిఇది భారత వలస పాలన నాటి చేదు జ్ఞాపకాలను దూరం చేస్తుందిఇది చట్టపరమైన భాషను సులభతరం చేస్తుందిసంక్లిష్టమైన నిబంధనలనూ సులభతరం చేస్తుందిప్రభావవంతంగా అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసే అధికారం కల్పించే ఒక నిబంధనను ప్రవేశపెడుతుందిప్రామాణిక రిపీల్-సేవింగ్ నిబంధనను చేర్చడం ద్వారా ఈ చట్టం.. పాత చట్టం కింద గల గత చర్యల కొనసాగింపునుచట్టపరమైన చెల్లుబాటును నిర్ధారిస్తుందిస్పష్టతను పెంచడంఅవగాహన సౌలభ్యాన్ని ప్రోత్సహించడందేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే సమకాలీన వాణిజ్యచట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా చట్టాన్ని సాఫీగా అమలు చేయడం లక్ష్యంగా ఈ సంస్కరణలు రూపొందించారు.

"ద బిల్స్ ఆఫ్ ల్యాండింగ్-2025బిల్లు మన రాజ్యాంగ విలువలను ప్రతిబింబిస్తుందికాలం చెల్లిన వలస చట్టాల స్థానంలో ఆధునికమైనఅందరికీ అందుబాటులో ఉండే విధానాలను అమలు చేయడంలో కీలకమైన ముందడుగును ఇది సూచిస్తుందిమన సముద్ర రంగం వేగంగా విస్తరిస్తున్నందునఈ సంస్కరణ వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుంది.. వివాదాలను తగ్గిస్తుంది.. ప్రపంచ వాణిజ్యంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది'అలలను పాలించేవారే ప్రపంచాన్ని పాలిస్తారుని ఒక సామెత చెప్పినట్లుగా భారత్... ప్రపంచాన్ని ముందుండి నడిపించే సమయం వచ్చిందిఅని పేర్కొన్న సర్బానంద సోనోవాల్ఈ బిల్లుకు మద్దతునివ్వాలని గౌరవ సభ్యులను కోరారు.

 

***


(रिलीज़ आईडी: 2146636) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali