ప్రధాన మంత్రి కార్యాలయం
చరిత్రాత్మక అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి
Posted On:
15 JUL 2025 3:34PM by PIB Hyderabad
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చరిత్రాత్మక యాత్ర చేపట్టి, భూమికి తిరిగివచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఐఎస్ఎస్ చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా కెప్టెన్ శుక్లా సాధించిన విజయం అసాధారణమైందని, దేశ అంతరిక్ష ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టమని ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో స్పందిస్తూ:
“చరిత్రాత్మక అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా ముగించుకుని భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను దేశ వాసులందరితో పాటు స్వాగతిస్తున్నాను. అంకిత భావం, సాహసం, స్ఫూర్తి పెట్టుబడిగా ఐఎస్ఎస్ చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా కెప్టెన్ శుక్లా సాధించిన విజయం కోటి కలలకు ఊపిరి పోస్తోంది. మన మానవ-సహిత గగన్ యాన్ మిషన్ ప్రయాణంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 2145110)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam