ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం: సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


• పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధానమంత్రి

Posted On: 15 JUL 2025 10:02PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారుమృతుల్లో ప్రతి ఒక్కరికీ  రూ.2 లక్షల వంతునగాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్నుంచి ఎక్స్‌గ్రేషియాను సంబంధిత కుటుంబాలకు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూఇలా పేర్కొంది:

‘‘ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌లో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరిగిందని తెలిసి బాధపడ్డానుఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియచేస్తూ.... గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ  రూ.2 లక్షల వంతునగాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ఇస్తాంప్రధానమంత్రి @narendramodi’’.‌

 

***


(Release ID: 2145103) Visitor Counter : 3