ప్రధాన మంత్రి కార్యాలయం
తెలంగాణ లోని సంగారెడ్డిలో ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం...ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధానమంత్రి సంతాపం
• పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియాను ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
30 JUN 2025 2:33PM by PIB Hyderabad
తెలంగాణలోని సంగారెడ్డిలో ఓ కర్మాగారంలో అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 చొప్పున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి నష్టపరిహారాన్ని అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“తెలంగాణరాష్ట్రం, సంగారెడ్డిలోగల ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు వంతున, క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్-గ్రేషియా అందిస్తాం: ప్రధాని @narendramodi”
“తెలంగాణరాష్ట్రం, సంగారెడ్డిలోగల ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాం : ప్రధాని @narendramodi”
***
MJPS/SR
(Release ID: 2140773)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam