ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మారిషస్ ప్రధానమంత్రితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


* భారత్, మారిషస్‌ల మధ్య ప్రత్యేక, అద్వితీయ సంబంధాలున్నాయని స్పష్టీకరణ...
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇంకా గాఢతరం చేసుకుందామని ఉమ్మడి నిబద్ధత పునరుద్ఘాటించిన నేతలు

* రెండు దేశాల్లో అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాల్లో కూడా సహకారాన్ని పెంచుకొనేందుకు తీసుకోదగ్గ చర్యలపై నేతల చర్చ

* 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ రామ్‌గులామ్ మనస్ఫూర్తిగా పాల్గొన్నారంటూ ప్రధానమంత్రి ప్రశంసలు

* ‘విజన్ మహాసాగర్’, ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానాలకు అనుగుణంగా ఉండే మారిషస్‌ అభివృద్ధి ప్రాథమ్యాల పట్ల ఇండియా కట్టుబాటును పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ

Posted On: 24 JUN 2025 9:56PM by PIB Hyderabad


మారిషస్ ప్రధానమంత్రి గౌరవనీయ డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులామ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం (ఈ నెల 24న) టెలిఫోన్‌లో మాట్లాడారు.

భారత్, మారిషస్‌‌ల మధ్య ప్రత్యేక, అద్వితీయ సంబంధాలు ఉన్నాయన్న సంగతిని నేతలు ఇద్దరూ ప్రధానంగా ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇప్పటి కంటే గాఢతరం చేసుకోవాలని ఉందంటూ, ఈ విషయంలో వారు తమ నిబద్ధతను మరోసారి చాటారు.    

అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు, రక్షణ, సముద్ర సంబంధ భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అనేక రంగాలలో ప్రస్తుత సహకారం గురించి వారు చర్చించారు.
 
పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ రామ్‌గులామ్ మనస్ఫూర్తిగా పాల్గొన్నారంటూ ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసలు కురిపించారు.

‘విజన్ మహాసాగర్’తో పాటు భారత్ అనుసరిస్తున్న ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ (పొరుగు దేశాలకు ప్రాధాన్యం) విధానానికి అనుగుణంగా ఉండే మారిషస్‌ అభివృద్ధి ప్రాథమ్యాల పట్ల ఇండియా దృఢ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

వీలయినంత త్వరలో భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ రామ్‌గులామ్‌ను ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు.  తరచుగా సంప్రదింపులు జరుపుకొందామని నేతలు ఇద్దరూ అంగీకరించారు.

 

 

***


(Release ID: 2139475)