రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

'వింగ్స్ టు అవర్ హోప్స్'(ఆశావోం కి ఉడాన్) పుస్తకం రెండో సంపుటి తొలి ప్రతిని అందుకున్న రాష్ట్రపతి


రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్,

సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్‌ సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 23 JUN 2025 6:52PM by PIB Hyderabad

సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్‌తో కలిసి రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్.. 'వింగ్స్ టు అవర్ హోప్స్(ఆశావోం కి ఉడాన్పుస్తకం రెండో సంపుటిని ఆవిష్కరించి తొలి ప్రతిని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు అందజేశారుఈరోజు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రచురణల విభాగం డైరెక్టరేట్సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

'వింగ్స్ టు అవర్ హోప్స్పుస్తకం రెండో సంపుటిని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్స్ విభాగం ప్రచురించిందిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రెండో సంవత్సర పదవీకాలంలో చేసిన ప్రసంగాల నుంచి ఎంపిక చేసిన ప్రసంగాలతో ఈ పుస్తకాన్ని ముద్రించారుఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ఇతర ప్రముఖుల సమక్షంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.

పుస్తకంలోని రెండో సంపుటిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాల నుంచి ఎంపిక చేసిన 51 ప్రసంగాలు ఉన్నాయివీటిని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాలువిద్య ద్వారా సమగ్ర అభివృద్ధిని పెంపొందించడంనిస్వార్థ సేవ కోసం కర్మయోగుల్లో స్ఫూర్తిని నింపడంసాయుధ దళాలు మన జాతికి గర్వకారణంపౌరుల సాధికారతలో పాలన పాత్రఅత్యుత్తమ విజయాలను గుర్తించడంప్రపంచ సంబంధాలను నిర్మించడం-బలోపేతం చేయడంమన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంవ్యవసాయంలో ఆవిష్కరణలుభారత వృద్ధికి చోదకశక్తిప్రకృతితో మనం మమేకం కావడంమహిళా సాధికారత-అవరోధాలను ఛేదించడం అనే 11 విభాగాలుగా వర్గీకరించారు.

 

***


(Release ID: 2139069)