ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 18 JUN 2025 2:42PM by PIB Hyderabad

ప్రధానమంత్రి కార్నీ,

గౌరవనీయులారా,

నమస్కారం!
జీ-శిఖరాగ్ర సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి.. అపూర్వ స్వాగతం పలికిన ప్రధానమంత్రి కార్నీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుజీ-కూటమి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంలో మా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,
భవిష్యత్ తరాలకు ఇంధన భద్రతను నిర్ధారించడం మన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటిదీనిని మేం ప్రాధాన్యంగా మాత్రమే కాకుండా మా పౌరుల పట్ల బాధ్యతగా కూడా భావిస్తున్నాంలభ్యతఅందుబాటులో ఉండడంచౌక ధర
ఆమోదయోగ్యత అనే ప్రాథమిక సూత్రాల ఆధారంగా ముందుకు సాగుతూభారత్ సమ్మిళిత అభివృద్ధి మార్గాన్ని ఎంచుకుంది.

నేడుభారత్‌లో దాదాపుగా అన్ని ఇళ్లకూ విద్యుత్ కనెక్షన్ ఉందిదేశంలో యూనిట్ విద్యుత్ ధర అత్యంత తక్కువగా ఉందిప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీభారత్ తన పారిస్ నిబద్ధతలను ముందుగానే పూర్తి చేసింది. 2070 నాటికి నికరంగా సున్నా ఉద్గారాలను సాధించే లక్ష్యం దిశగా వేగంగా పురోగమిస్తోందిఇప్పటికే కలిగి ఉన్న మొత్తం సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వాటా దాదాపు 50 శాతంగా ఉంది.

2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని సాధించే దిశగా మేం దృఢంగా ముందుకు సాగుతున్నాంపరిశుద్ధ ఇంధనం కోసం గ్రీన్ హైడ్రోజన్న్యూక్లియర్ ఎనర్జీఇథనాల్ మిశ్రమం వంటి వాటిపై మేం ప్రధానంగా దృష్టి సారిస్తున్నాంప్రపంచంలోని అన్ని దేశాలు హరితసుస్థిర భవిత దిశగా పయనించేందుకు మేం స్ఫూర్తినిస్తున్నాం.

మేం దీనికోసం అంతర్జాతీయ సౌర కూటమివిపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమిమిషన్ లైఫ్ప్రపంచ జీవఇంధనాల కూటమివన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ వంటి ప్రపంచస్థాయి కార్యక్రమాలను ప్రారంభించాం.

మిత్రులారా,
ఇంధన పరివర్తన దిశగా అన్ని దేశాలు కలిసి ముందుకు సాగడం చాలా అవసరం. "నేను కాదుమనంఅనే స్ఫూర్తితో మనం ముందుకు సాగాలిగ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితిసంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయిప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నా.. ఆహారంఇంధనంఎరువుల విషయంలోనే కాకుండా
ఆర్థిక సంక్షోభాలతో ముందుగా దెబ్బతినేది వారే.

ప్రజలువస్తువులుతయారీరవాణా రంగాలు కూడా ప్రభావితమవుతాయిగ్లోబల్ సౌత్‌లో నెలకొన్న ఆందోళనలుప్రాధాన్యతలను ప్రపంచ వేదికపై లేవనెత్తడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తుందిఏ రూపంలోనైనా ద్వంద్వ ప్రమాణాలు కొనసాగినంత వరకు.. మానవాళికి సుస్థిరమైనసమగ్ర అభివృద్ధి అందుబాటులో ఉండదని మేం విశ్వసిస్తున్నాం.

మిత్రులారా,
నేను మీ ముందు ఉగ్రవాదం గురించి ప్రస్తావించాలనుకుంటున్నానుఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదుఇటీవలే హేయమైనపిరికితనంతో కూడిన ఉగ్రవాద దాడిని భారత్ ఎదుర్కొంది.

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కేవలం పహల్గామ్‌పై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి ఆత్మగుర్తింపుగౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడిఇది మొత్తం మానవాళిపై జరిగిన దాడిఈ దాడిని తీవ్రంగా ఖండించిప్రగాఢ సంతాపాన్ని తెలిపిన మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,
ఉగ్రవాదం మానవాళికి శత్రువుప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలు దీనిని వ్యతిరేకించాలిఉగ్రవాదంపై పోరాటంలో ఐక్యత తప్పనిసరిదురదృష్టవశాత్తూ మా పొరుగు దేశం ఉగ్రవాదానికి నిలయంగా మారిందిప్రపంచ శాంతిశ్రేయస్సు కోసం మన ఆలోచనలువిధానాలు స్పష్టంగా ఉండాలిఏదైనా దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

అయితే వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉందిఒకవైపు.. మన సొంత ప్రాధాన్యతలుఆసక్తుల ఆధారంగా మనం వివిధ దేశాలపై ఆంక్షలు విధించడానికి తొందరపడుతున్నాంమరోవైపు.. ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్ధించే దేశాలకు ప్రతిఫలం లభిస్తూనే ఉందిఇక్కడ ఉన్నవారిని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను.

ఉగ్రవాదాన్ని మనం సీరియస్ గా తీసుకుంటున్నామాఉగ్రవాదం సొంత తలుపులు తట్టినప్పుడు మాత్రమే దాని గురించి సరిగ్గా అర్థం చేసుకుంటామాఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారినీదానితో బాధపడేవారినీ ఒకే విధంగా పరిగణించవచ్చామన ప్రపంచ సంస్థలు విశ్వసనీయతను కోల్పోయే స్థితిలో ఉన్నాయా?

మానవాళికి వ్యతిరేకంగా నిలిచే ఈ ఉగ్రవాదంపై నేడు మనం నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతేచరిత్ర మనల్ని ఎప్పటికీ క్షమించదుస్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పట్టించుకోకపోవడంఉగ్రవాదానికి.. ఉగ్రవాదులకు మద్దతునివ్వడం.. మొత్తం మానవాళికి ద్రోహం చేయడమే అవుతుంది.

మిత్రులారా,
భారత్ ఎల్లప్పుడూ తన సొంత ప్రయోజనాల కంటే ముందు మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తుందిభవిష్యత్తులోనూ మేం అన్ని విషయాల్లో జీ-7తో చర్చలుసహకారం కొనసాగిస్తూనే ఉంటాం.

ధన్యవాదాలు.

మిత్రులారా,
సాంకేతికతఏఐఇంధనం వంటి అంశాలపై నేను కొన్ని విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నానునిస్సందేహంగాఅన్ని రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించడానికిఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏఐ ఒక శక్తిమంతమైన సాధనంగా అభివృద్ధి చెందుతోందిఏఐ అత్యంత శక్తిమంతమైన సాంకేతితఏఐ డేటా సెంటర్ల ద్వారా పెరుగుతున్న ఇంధన వినియోగం కోసంనేటి సాంకేతికత-ఆధారిత సమాజాల నుంచి పెరుగుతున్న ఇంధన డిమాండ్ల కోసం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా మాత్రమే సుస్థిర పరిష్కారం లభిస్తుంది.

సరసమైనవిశ్వసనీయమైనసుస్థిర ఇంధనం భారతదేశానికి అత్యంత ప్రాధాన్యంగా ఉందిదీనిని సాధించడానికిమేం సౌరశక్తిచిన్న మాడ్యులర్ రియాక్టర్లపై దృష్టి సారిస్తున్నాంపునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని డిమాండ్ కేంద్రాలతో అనుసంధానించడానికి స్మార్ట్ గ్రిడ్‌లుఇంధన నిల్వ వ్యవస్థలుహరిత ఇంధన కారిడార్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నాం.

మిత్రులారా,
భారత్‌లో మా ప్రయత్నాలన్నీ మానవ-కేంద్రిత విధానంపైనే ఆధారపడి ఉన్నాయిఏదైనా సాంకేతికత నిజమైన విలువ అందరికీ ప్రయోజనం చేకూర్చడం దాని సామర్థ్యంలోనే ఉంటుందని మేం నమ్ముతున్నాంగ్లోబల్ సౌత్‌లో ఎవరూ వెనుకబడి ఉండకూడదుఉదాహరణకుమేం ఏఐ ఆధారిత వాతావరణ అంచనా యాప్‌ను అభివృద్ధి చేస్తేఅది మా దేశంలోని ఒక చిన్న గ్రామంలో నివసించే రైతులకుమత్స్యకారులకు కూడా ప్రయోజనం చేకూర్చినప్పుడు మాత్రమే అది నిజంగా విజయం సాధించినట్లు అవుతుంది.

భారత్‌లోని మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ప్రపంచ భాషలతో అనుసంధానమయ్యేలా.. ప్రపంచ సంభాషణల్లో పాలుపంచుకునేలా చేసేందుకు మేం 'భాషిణిఅనే ఏఐ-ఆధారిత భాషా యాప్‌ను అభివృద్ధి చేశాంమేం సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించాండిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ద్వారా మా ఆర్థిక వ్యవస్థనూసామాన్యులను శక్తిమంతం చేశాం.

అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం మానవ-కేంద్రిత విధానాన్ని అవలంబించాలిఏఐ సామర్థ్యాన్నిఉపయోగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారుఅయితే నిజమైన సవాలు ఏఐ శక్తిసామర్థ్యం కాదు.. ఏఐ సాధనాలు మానవాళి గౌరవాన్నీసాధికారతనీ పెంపొందించేలా చూసుకోవడం.

మిత్రులారా,
సమగ్రమైనసమర్థమైనబాధ్యతాయుతమైన ఏఐ కోసం సమగ్రమైన డేటా ఒక పునాది వంటిదిభారత వైవిధ్యం దాని శక్తిమంతమైన జీవనశైలిబహుళ భాషలువిస్తారమైన భూభాగంలో ప్రతిబింబిస్తుందిఇదే సమగ్ర డేటా కోసం అత్యంత విలువైనశక్తిమంతమైన వనరుల్లో ఒకటిగా దీనిని నిలుపుతుందిభారత వైవిధ్య ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించినపరీక్షించిన ఏఐ నమూనాలు యావత్ ప్రపంచం కోసం అత్యంత ఔచిత్యాన్నిప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.

భారత్‌లోబలమైన డేటా సాధికారతభద్రతా వ్యవస్థను రూపొందించడంపై మేం ప్రధానంగా దృష్టి సారించాందీనితో పాటుభారత్ తన స్థాయినైపుణ్యంవైవిధ్యంప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత ద్వారా ఏఐ రంగంలో ప్రపంచ ప్రయత్నాలకు గణనీయంగా దోహదపడే విస్తారమైన ప్రతిభను కలిగి ఉంది.

మిత్రులారా,
ఏఐ విషయంగా నేను కొన్ని సూచనలను అందించాలనుకుంటున్నానుమొదట.. ఏఐ సంబంధిత సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించే అంతర్జాతీయ స్థాయి పాలన కోసం మనం కృషి చేయాలిఅప్పుడే మనం ప్రపంచానికి మేలు చేసే ఒక శక్తిగా ఏఐని మార్చగలంరెండోది.. ఏఐ యుగంలో క్రిటికల్ మినరల్స్సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం చాలా ముఖ్యం.

వాటి సరఫరా వ్యవస్థల భద్రతఅన్ని రకాల పరిస్థితులను తట్టుకునేలా ఆ వ్యవస్థను బలోపేతం చేయడంపై మనం దృష్టి సారించాలిఏ దేశమూ వాటిని తమ సొంత ప్రయోజనాల కోసం గానీఆయుధంగా గానీ ఉపయోగించకుండా చూసుకోవాలిమూడోది.. డీప్ ఫేక్ చాలా ఆందోళన కలిగించే విషయంఎందుకంటే ఇది సమాజంలో అశాంతిని సృష్టించగలదుఅందువల్లఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై వాటర్‌మార్కింగ్ లేదా స్పష్టమైన గుర్తు ఉండాలి.

మిత్రులారా,
గత శతాబ్దంలోమనం ఇంధనం విషయంలో పోటీని చూశాంఈ శతాబ్దంలోమనం సాంకేతిక రంగంలో సహకారాన్ని స్వీకరించాలి'సబ్ కా సాథ్సబ్ కా వికాస్సబ్ కా విశ్వాస్ఔర్ సబ్ కా ప్రయాస్మార్గదర్శక సూత్రంతో మనం ముందుకు సాగాలి... అంటే ప్రజలుప్రపంచంపురోగతి కోసం భారత్ ఇస్తున్న పిలుపు ఇదిఇదే స్ఫూర్తితో.. వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

 

***


(Release ID: 2137515)