ప్రధాన మంత్రి కార్యాలయం
గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III ను అందుకున్న ప్రధానమంత్రి
Posted On:
16 JUN 2025 1:33PM by PIB Hyderabad
సైప్రస్లో ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III’’ను ఆ దేశ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టొడౌలిడెస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు.
ఈ సన్మానాన్ని 140 కోట్ల మంది భారతీయుల పక్షాన ప్రధానమంత్రి స్వీకరిస్తూ, సైప్రస్ అధ్యక్షునికీ, సైప్రస్ ప్రభుత్వానికీ, సైప్రస్ ప్రజలకూ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును ఉమ్మడి విలువలు, పరస్పర విశ్వాసం పునాదులుగా నిలిచిన భారత్, సైప్రస్ల దీర్ఘకాలిక స్నేహ సంబంధాలకు ప్రధానమంత్రి అంకితం చేశారు. ఈ పురస్కారం భారత్ యుగయుగాలుగా అనుసరిస్తూ వస్తున్న, ప్రపంచ శాంతికి, ప్రగతికి దారిదీపంగా ఉంటున్న ‘‘వసుధైవ కుటుంబకమ్’’ భావనకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.
ఈ గౌరవం భారత్, సైప్రస్ల భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికి, విస్తరించడానికీ కట్టుబడి ఉండటమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ అవార్డు శాంతికీ, భద్రతకూ, సార్వభౌమత్వానికీ, ప్రాదేశిక సమగ్రతకూ, సమృద్ధికీ ఇరు దేశాల తిరుగులేని నిబద్ధతకు ఒక ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు.
****
(Release ID: 2136621)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam