ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జమ్మూ కాశ్మీర్‌లో మెరుగైన రవాణా లక్ష్యాన్ని, ఆ దిశగా రూ. 46,000 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులను వివరించిన ప్రధాని


ప్రధాని పర్యటన నేపథ్యంలో చీనాబ్ వంతెన వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి

Posted On: 05 JUN 2025 7:04PM by PIB Hyderabad

జమ్మూ కాశ్మీర్‌లో రవాణా మెరుగుదల లక్ష్యాన్ని, అందుకోసం రూ. 46,000 కోట్లతో చేపట్టిన కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ ప్రాంతంలో రవాణా సదుపాయాలను మెరుగుపరచడంలో ఇదో చారిత్రక ఘట్టం.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో, ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెన అయిన ప్రతిష్ఠాత్మక చీనాబ్ వంతెన వద్ద ఏర్పాట్లను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి సమీక్షించారు.

చీనాబ్ రైలు వంతెన జమ్మూ, శ్రీనగర్ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టు అన్ని రకాల వాతావరణ పరిస్థితులకూ తగిన విధంగా అనుసంధానాన్ని అందిస్తుందని, అలాగే శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా - శ్రీనగర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలూ లభిస్తాయని ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి చేసిన పోస్టులకు స్పందిస్తూ, ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘రేపు, అంటే జూన్ 6 జమ్మూ కాశ్మీర్‌లోని నా సోదరీ సోదరులకు నిజంగా ఓ ప్రత్యేకమైన రోజు. ప్రజల జీవితాలపై చాలా సానుకూల ప్రభావం చూపే రూ. 46,000 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి.

చీనాబ్ రైలు వంతెన అసాధారణమైన నిర్మాణ నైపుణ్యం మాత్రమే కాదు, జమ్మూ - శ్రీనగర్ మధ్య అనుసంధానాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. సవాళ్లతో కూడిన భౌగోళిక ప్రాంతంలో నిర్మించిన భారతదేశపు మొదటి తీగల రైల్వే వంతెన అయిన అంజి వంతెన అతి ఎత్తయినదిగా నిలిచింది.

ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టు అన్ని రకాల వాతావరణ పరిస్థితులకూ తగిన విధంగా అనుసంధానాన్ని అందిస్తుంది. అలాగే శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా - శ్రీనగర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రారంభించడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం పెరగడంతోపాటు జీవనోపాధి అవకాశాలూ లభిస్తాయి.’’  

 

***


(Release ID: 2134420)