ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని భుజ్‌లో రూ. 53,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఈరోజు గొప్ప వాణిజ్య, పర్యాటక కేంద్రంగా మారిన కచ్ రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద పాత్ర పోషించబోతోంది: ప్రధాని

సముద్ర ఉత్పత్తుల నుంచి పర్యాటకం, వాణిజ్యం వరకు తీరప్రాంతాలలో భారత్ కొత్త సానుకూల వ్యవస్థను నిర్మిస్తోంది: ప్రధాని

ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడమే మా విధానం: ప్రధానమంత్రి

మానవతను కాపాడటం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ ఆపరేషన్ సిందూర్: ప్రధాని

ఉగ్రవాద కేంద్రాలు ఎక్కడున్నదీ భారత్ కు ముందే తెలుసు

గురి చూసి కొట్టేశాం... ఇది మన సాయుధ దళాల శక్తికీ, క్రమశిక్షణకీ సూచిక: ప్రధాని

సీమాంతర ఉగ్రవాదం పైనే భారతదేశ పోరాటం ప్రధానమంత్రి

Posted On: 26 MAY 2025 7:22PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని భుజ్‌లో రూ. 53,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనప్రారంభోత్సవాలు చేసికొన్నింటిని జాతికి అంకితం చేశారుఈ సందర్భంగా మాట్లాడుతూకచ్  ప్రజలకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారువిప్లవకారులనువీరమరణం పొందిన యోధులను ప్రత్యేకించి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ శ్యామ్‌జీ కృష్ణ వర్మను ప్రధాని స్మరించుకున్నారుకచ్ కు చెందిన పుత్రులుపుత్రికల ధైర్యంసంకల్పం సేవలను ప్రధాని ప్రశంసించారువారికి అభివాదం తెలియజేశారు.

పవిత్ర భూమి కచ్ లో ఆశాపుర మాత దివ్య ఉనికిని గుర్తు చేస్తూశ్రీ మోదీ ఆమెకు నివాళులు అర్పించారుఈ ప్రాంతంపై ఆమె నిరంతర ఆశీస్సులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూఅక్కడి ప్రజలకు కూడా తన గౌరవాన్ని తెలియజేశారు.

కచ్ తో తమ ప్రగాఢ అనుబంధాన్ని ప్రస్తావిస్తూఈ జిల్లాను ఎన్నోసార్లు సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారుఈ భూమి తన జీవన దిశను రూపుదిద్దినట్లు ఆయన పేర్కొన్నారుగతంలో ఎన్నో సవాళ్లు ఎదురైనాఇప్పుడు జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారునర్మదా నదీ జలాలు కచ్ ప్రాంతానికి చేరినప్పుడు తన అదృష్టంగా భావించానని ఆయన గుర్తు చేసుకున్నారుముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు నుంచే తాను తరచూ కచ్ కి వచ్చేవాడిననిజిల్లా కార్యాలయంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడినని తెలిపారుకచ్ రైతుల ధృఢ సంకల్పాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూవారి స్ఫూర్తి ఎప్పుడూ గొప్పదిగా ఉండేదని ప్రశంసించారుఈ ప్రాంతంలో గడిపిన అనేక సంవత్సరాల అనుభవం కచ్ అభివృద్ధికి తాను చేసిన కృషికి ఎంతో తోడ్పడిందని ఆయన పేర్కొన్నారు

అద్భుతమైన విజయాన్ని సాధించడంలోనమ్మకంనిరంతర శ్రమ శక్తిని కచ్ రుజువు చేసిందని ప్రధాని అన్నారుఒక భయానక భూకంపం అనంతరం ఈ ప్రాంత భవిష్యత్తుపై చాలామందిలో అనిశ్చితి సందేహాలు తలెత్తాయనిఅయితేకచ్  మళ్లీ నిలబడుతుందనే నమ్మకం తనకు ఎప్పుడూ ఉందనిఆ విశ్వాసాన్ని ప్రజలే సాకారం చేసారని ఆయన అన్నారు. “ఈరోజు  కచ్ వ్యాపారంవాణిజ్యంపర్యాటకానికి ఒక ప్రధాన కేంద్రంగా నిలిచింది” అని ప్రధాని పేర్కొన్నారురాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంత పాత్ర మరింత విస్తరించబోతోందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారుకచ్ వేగవంతమైన అభివృద్ధిని చుస్తున్నందుకుదానికి తోడ్పాటుగా ఉండగలిగినందుకు ఆయన సంతోషాన్ని  వ్యక్తం చేశారుఈ పర్యటనలో భాగంగా మౌలిక వసతులుఆర్థిక అభివృద్ధికి  ఉద్దేశించిన రూ. 50,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారుఈ ప్రాజెక్టులు భారత్‌ ప్రముఖ నీలి ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీగాహరిత ఇంధనానికి అంతర్జాతీయ కేంద్రంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారుఈ విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు గానూ కచ్  ప్రజలను ప్రధాని హృదయపూర్వకంగా అభినందించారు.

కచ్  ప్రపంచంలోనే అతిపెద్ద హరిత ఇంధన కేంద్రంగా ఎదుగుతోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారుగ్రీన్ హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా అభివర్ణిస్తూదాని విప్లవాత్మక సామర్థ్యాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారుకార్లుబస్సులువీధిదీపాలు వంటి వాటిని త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా నడపబోతున్నామనిఇది భారత ఇంధన రంగాన్ని సంపూర్ణంగా మార్చివేసే మార్గంలో ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారుదేశవ్యాప్తంగా గుర్తించిన మూడు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లలో కాండ్లా ఒకటిగా ఉన్నదని ఆయన తెలిపారుకచ్ లో కొత్త గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామనిఈ కేంద్రంలో ఉపయోగించే సాంకేతికత పూర్తిగా “మేడ్ ఇన్ ఇండియా” అని ఆయన తెలిపారుభారతదేశ సౌర విప్లవంలో కూడా కచ్ కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొంటూప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉందని ఆయన తెలిపారుఖావ్డా కాంప్లెక్స్ ఏర్పాటుతో కచ్ ప్రపంచ ఇంధన పటంలో తన స్థానం సుస్థిర పరుచుకుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రజలపై విద్యుత్ వ్యయ భారాన్ని తగ్గిస్తూ సరిపడా విద్యుత్ అందేలా చూసుకోవటంలో ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించిన ప్రధాని.. గుజరాత్‌లో ఇప్పటికే లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన పీఎం సూర్య గర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధానంగా ప్రస్తావించారుసముద్రతీర ప్రాంతాల ఆర్థిక ప్రాముఖ్యతపై మాట్లాడుతూ.. సముద్ర రంగ అభివృద్ధి అనేక దేశాల వృద్ధిలో కీలకమైనదిగా ఉందని అన్నారుభారతదేశ సుసంపన్న వారసత్వంచారిత్రక వాణిజ్యంఅభివృద్ధికి ధోల వీరాలోథాల్ వంటి ప్రాచీన ఓడరేవు నగరాలను ప్రధాన ఉదాహరణలుగా పేర్కొన్నారుఈ వారసత్వాన్ని ప్రేరణగా తీసుకొని ఓడరేవుల కేంద్రంగా నగరాలను విస్తరించాలన్న దార్శనికతపై ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారుసముద్ర ఆహరంపర్యాటకంవాణిజ్యం కలగలిసిన కొత్త సముద్ర వ్యవస్థను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారుఓడరేవులను ఆధునికీకరించడంవిస్తరించడంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని.. ఇప్పటికే ఇది మంచి ఫలితాలకు దారితీసిందని అన్నారుమొదటిసారిగా ప్రధాన ఓడరేవులు ఒక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 15 కోట్ల టన్నుల సరుకును సరఫరా చేశాయనిఇందులో కాండ్లా ఓడరేవు కీలక పాత్ర పోషించిందని తెలిపారుభారత సముద్ర వాణిజ్యంలో దాదాపు మూడింట ఒక వంతు కచ్ ఓడరేవు ద్వారా జరుగుతున్నట్లు పేర్కొన్నారుమౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను గుర్తించామని.. కాండ్లాముంద్రా ఓడరేవులలో సామర్థ్యంఅనుసంధాతను నిరంతరం మెరుగుపరుస్తున్నట్లు తెలియజేశారుకార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కొత్త జెట్టీమెరుగుపరిచిన కార్గో నిల్వ సదుపాయంతో సహా పలు సరుకు రవాణా సంబంధిత సౌకర్యాలను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారుసముద్ర రంగంపై పెరిగిన ప్రభుత్వ దృష్టిని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని.. ఈ రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారునౌకానిర్మాణ ప్రాముఖ్యతపై కూడా ప్రధానంగా మాట్లాడారుభారత్ దేశీయ అవసరాల కోసం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల కోసం కూడా పెద్ద నౌకలను తయారు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారుఈ కార్యక్రమాలు సముద్ర రంగంలో దేశ యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని వ్యాఖ్యానించారు.

కచ్‌కు తన వారసత్వ సంపద పట్ల ఉన్న లోతైన గౌరవాన్ని ప్రస్తావించిన మోదీ.. అదే ఇప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో చోదక శక్తిగా మారిందని అన్నారుభుజ్‌లో వస్త్రాలుఆహార శుద్ధిసిరామిక్స్ఉప్పు తయారీ వంటి వివిధ పరిశ్రమలలో గత రెండు దశాబ్దాల్లో కనిపించిన అద్భుతమైన వృద్ధిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారుకచ్ ఎంబ్రాయిడరీబ్లాక్ ప్రింటింగ్బంధాని వస్త్రంతోలు పని వంటి కచ్ సంప్రదాయ చేతిపనులకు విస్తృత గుర్తింపు వచ్చిందని అన్నారుభుజోడి గ్రామాన్ని చేనేత కళకు సంబంధించిన సజీవ మ్యూజియంగా వర్ణించారుఅజ్రాఖ్ ప్రింటింగ్ సంప్రదాయం ప్రత్యేకతను ప్రశంసించారుదీనికి ఇప్పుడు భౌగోళిక సూచిక (జీఐట్యాగ్ వచ్చిందనిదీనితో ఈ కళకు సంబంధించిన అధికారిక మూలంగా కచ్‌కు గుర్తింపు లభించిందని అన్నారు.
ఈ గుర్తింపు ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారుగిరిజన కుటుంబాలుచేతివృత్తులవారికి ఇది చాలా ముఖ్యమని.. ఇది వారి సాంస్కృతిక గుర్తింపుహస్తకళలను బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.
తోలువస్త్ర పరిశ్రమలకు మద్దతు ఇచ్చేందుకు బడ్జెట్‌లో ప్రకటించిన పలు కీలక విషయాలను ప్రధానంగా తెలిపిన ఆయన.. ఈ రంగాలను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

కచ్‌లోని కష్టపడి పనిచేసే రైతులను ప్రశంసించిన ఆయన.. సవాళ్లను అధిగమించడంలో వారి పట్టుదలను ప్రస్తావించారుగుజరాత్‌లో భూగర్భ జలాలు తీవ్రంగా క్షీణించి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సమయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారునర్మదా ఆశీస్సులుప్రభుత్వం అంకితభావంతో చేపట్టిన పనులతో  పరిస్థితి మారిపోయిందన్నారుకచ్ గమనాన్ని మార్చటంలో కెవాడియా నుంచి మోడ్కుబా వరకు కాలువ విస్తరణ పోషించిన కీలక పాత్రను ప్రధానంగా ప్రస్తావించారునేడు కచ్ నుంచి మామిడిఖర్జూరందానిమ్మజీలకర్రడ్రాగన్ ఫ్రూట్ వంటి వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారుఈ ప్రాంత గతాన్ని గుర్తుచేసుకుంటూ.. పరిమిత అవకాశాల కారణంగా కచ్ ఒకప్పుడు వలసలను ఎదుర్కొందనిఅయితే సాధించిన అద్భుతమైన పురోగతితో స్థానిక యువత ఇప్పుడు కచ్‌లోనే ఉపాధిని పొందుతున్నారని అన్నారుఇది ఈ ప్రాంతంలో జరుగుతోన్న అభివృద్ధిని తెలియజేస్తుందన్నారు

భారతదేశ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం తమ ప్రభుత్వానికి కీలకమైన ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారుపర్యాటకం పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించగల రంగమని అన్నారుకచ్ దాని గొప్ప చరిత్రసాంస్కృతిక వారసత్వంసహజ సౌందర్యంతో ఈ రంగంలో విస్తరించేందుకు అనుకూల స్థితిలో ఉందని ప్రధానంగా ప్రస్తావించారుకచ్‌లో జరిగే రణ్ ఉత్సవ్‌‌కు సంబంధించి పెరుగుతోన్న ప్రజాదరణపై సంతృప్తి వ్యక్తం చేశారుఇది మరిన్ని కొత్త శిఖరాలకు చేరుకుంటుందని అన్నారుస్మృతి వాన్ స్మారక చిహ్నాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారుయునెస్కో దీనిని ప్రపంచంలోని అత్యంత అందమైన మ్యూజియంలలో ఒకటిగా గుర్తించిందని గుర్తు చేశారుకచ్ పర్యాటక పరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో మరింత వృద్ధిని సాధిస్తుందని.. ధోర్డో గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిందని వ్యాఖ్యానించారుమాండ్వి సముద్ర తీరం సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా అభివృద్ధి చెందుతోందని.. పర్యాటక సామర్థ్యాన్ని మరింత పెంచడానికి రణ్ ఉత్సవ్ సందర్భంగా మాండ్విలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని గుజరాత్ ముఖ్యమంత్రిని కోరారుఅహ్మదాబాద్భుజ్ మధ్య నమో భారత్ రాపిడ్ రైలు ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని మరింత పెంచుతుందని అన్నారు

2014లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుగా మే 26 తనకు ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారత్ నేడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారుపర్యాటక రంగాన్ని ప్రజలను అనుసంధానించే మార్గంగా భారత్ బలంగా విశ్వసిస్తుందని పునరుద్ఘాటించారుఅయితే పాకిస్తాన్ వంటి దేశాలు పర్యాటకానికి బదులుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. "ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించింది.. భారత్ దానిని ఏమాత్రం ఉపేక్షించని విధానంతో ముందుకు సాగుతోందిఅని ఆయన పునరుద్ఘాటించారుఆపరేషన్ సిందూర్‌ గురించి ప్రస్తావిస్తూఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న దృఢ వైఖరిని ఈ మిషన్ స్పష్టం చేసిందని ప్రధానమంత్రి తెలిపారుభారత పౌరులకు హాని కలిగించే ఏ ప్రయత్నానికైనా అదే భాషలో అంతే గట్టిగా ప్రతిస్పందన ఉంటుందన్న ఆయనభారతదేశాన్ని సవాలు చేసే ధైర్యం చేసే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేశారు.

"ఆపరేషన్ సిందూర్ మానవత్వాన్ని రక్షించే.. ఉగ్రవాదాన్ని నిర్మూలించే ఒక లక్ష్యంఅని ప్రధానమంత్రి వివరించారుఏప్రిల్ 22 ఘటన తర్వాత బీహార్‌లో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థలనువారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని చేసిన ప్రతిజ్ఞను ఆయన గుర్తు చేసుకున్నారుపహల్గామ్ దాడులు జరిగి పక్షం రోజులు గడిచినా కూడా ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఎటువంటి చర్య తీసుకోని సందర్భంలోవారికి గట్టి జవాబు ఇచ్చేందుకు భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన తెలిపారుభారత్ తన సాయుధ దళాల సామర్థ్యాన్నిక్రమశిక్షణను ప్రదర్శిస్తూ కచ్చితత్వంతో ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేసిందన్నారుఉగ్రవాద స్థావరాలను కచ్చితత్వంతో నిర్మూలించ గల భారత సత్తాను ప్రపంచానికి చూపించామని ఆయన వ్యాఖ్యానించారుభారత్ చేపట్టిన నిర్ణయాత్మక చర్యల తర్వాత పాకిస్తాన్ భయాందోళనకు గురైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  భారతీయ పౌరులపై పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించిందనిఅయితే రెట్టింపు బలంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంటూవారి సైనిక స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నాశనం చేసిందని ఆయన తెలిపారు. "పాకిస్తాన్ వైమానిక స్థావరాలుసైనిక స్థావరాలను భారత్ నాశనం చేయడం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందిఅని ఆయన అన్నారుసాయుధ దళాల అసాధారణ నైపుణ్యంధైర్యంకచ్చితత్వాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

పాకిస్తాన్ సైన్యం భుజ్ వైమానిక స్థావరంపై దాడి చేసిన 1971 చారిత్రాత్మక యుద్ధాన్ని గుర్తుచేసుకుంటూనాటి విపత్కర పరిస్థితుల్లో వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించిన భుజ్ మహిళల అసాధారణ ధైర్యసాహసాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారునిరంతరం పాకిస్తాన్ బాంబు దాడుల మధ్యభుజ్ మహిళలు 72 గంటల్లో వైమానిక స్థావరాన్ని పునర్నిర్మించిదాని కార్యాచరణ పునరుద్ధరణకు వీలు కల్పించారని ఆయన వివరించారుఈ ధైర్యవంతులైన మహిళలను కలిసే అవకాశం గతంలో తనకు లభించిందన్న ప్రధానమంత్రికఠినమైన పరిస్థితుల్లో వారు చూపిన తెగువఅందించిన సహకారం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

"సీమాంతర ఉగ్రవాదానికిదానిని ప్రోత్సహించే వారికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతోందిఅని ప్రధానమంత్రి స్పష్టం చేశారుభారత్ శతృత్వం... ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులతోనే కొనసాగుతోందిఏ దేశానికి చెందిన ప్రజలతోనూ కాదని ఆయన వివరించారుకచ్ నుంచి పాకిస్తాన్ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఆ దేశ ప్రజలు వారి వాస్తవిక పరిస్థితిని గుర్తించాలని ప్రధానమంత్రి కోరారువారి ప్రభుత్వంసైన్యం ఉగ్రవాదాన్ని సంపాదనకు మార్గంగా ఉపయోగిస్తూ వారికి మద్దతు ఇస్తున్నాయన్నారుఈ మార్గం నిజంగా వారికి ప్రయోజనం కలిగిస్తుందా అని ఆలోచించాలని పాకిస్తాన్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారుఅధికార ఆధారిత ఎజెండాలు పాకిస్తాన్ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయనివారి పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారుపాకిస్తాన్ ఉగ్రవాద మహమ్మారిని వదిలించుకోవాలంటేఆ దేశ ప్రజలు ఒక వైఖరి తీసుకొనిఉగ్రవాద నిర్మూలన కోసం కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారు.

భారత్ స్పష్టమైన దిశలో ముందుకుసాగుతోందని.. అభివృద్ధిశాంతిశ్రేయస్సుల మార్గాన్ని ఎంచుకుందని ప్రస్తావిస్తూఅభివృద్ధి చెందిన దేశంగా మారే భారత ప్రయాణంలో కచ్ స్ఫూర్తి ఎంతో ప్రేరణనిస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారుత్వరలోనేకచ్ నూతన సంవత్సరాన్ని జరుపుకోనున్న సందర్భంగా అక్కడి ప్రజలకు ఆషాఢీ బీజ్‌ కోసం ముందస్తు శుభాకాంక్షలు తెలిపారుకచ్ ప్రజల అద్భుతమైన పురోగతికొనసాగుతున్న అభివృద్ధి పనుల కోసం వారికి అభినందనలు తెలుపుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్కేంద్ర విద్యుత్గృహనిర్మాణంపట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

గుజరాత్‌లోని భుజ్‌లో రూ.53,400 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిపనులను ప్రారంభించారుఖావ్డా పునరుత్పాదక ఇంధన పార్కులో ఉత్పత్తి చేసే విద్యుత్తును తరలించే ప్రసార ప్రాజెక్టులుప్రసార నెట్‌వర్క్ విస్తరణతాపి వద్ద అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ వంటి విద్యుత్ రంగ ప్రాజెక్టులుఅలాగే కాండ్లా ఓడరేవు ప్రాజెక్టులుగుజరాత్ ప్రభుత్వ బహుళ రహదారులుజలసౌర విద్యుత్ ప్రాజెక్టులు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి.

 

 

***

MJPS/SR


(Release ID: 2131515)