ప్రధాన మంత్రి కార్యాలయం
హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంపట్ల ప్రధాని సంతాపం
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం
Posted On:
18 MAY 2025 12:00PM by PIB Hyderabad
హైదరాబాద్లో అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణనష్టంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
‘‘హైదరాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం తీవ్ర వేదనకు గురిచేసింది. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
మృతుల కుటుంబీకులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారం అందిస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాం: ప్రధానమంత్రి’’
@narendramodi
***
MJPS/VJ
(Release ID: 2129414)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam