ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సాహసిక యోధులు, జవానులతో భేటీ కావడానికి ఏఎఫ్ఎస్ ఆదంపూర్‌ను సందర్శించిన ప్రధాని

प्रविष्टि तिथि: 13 MAY 2025 12:40PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏఎఫ్ఎస్ ఆదంపూర్‌ను ఈ రోజు సందర్శించారు. మన దేశ సాహసిక యోధులను, సైనికులను కలుసుకోవడం కోసం ప్రధాని అక్కడికి వెళ్లారు. ‘‘ధైర్యం-సాహసం, దృఢ సంకల్పం, నిర్భయత్వం మూర్తీభవించిన వారితో భేటీ కావడం చాలా ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో:


‘‘ఈ రోజు ఉదయం, నేను ఏఎఫ్ఎస్ ఆదంపూర్‌కు వెళ్లాను.. శూరులైన మన వాయుసేన యోధులనూ, సైనికులనూ కలుసుకున్నాను. ధైర్యం-సాహసం, దృఢ సంకల్పం, నిర్భయత్వం మూర్తీభవించిన వారితో భేటీ కావడం చాలా ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. మన దేశ ప్రజల కోసం సర్వస్వాన్ని ఒడ్డే మన సాయుధ బలగాలకు భారత్‌ ఎప్పటికీ కృతజ్ఞురాలుగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.‌  

 

 

“Sharing some more glimpses from my visit to AFS Adampur.”

 

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2128367) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Nepali , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam