రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలు విఫలం: సముచిత రీతిలో తిప్పికొట్టిన భారత్‌

Posted On: 08 MAY 2025 2:34PM by PIB Hyderabad

ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించేందుకు 2025 మే 7న భారత్‌ విలేకరుల సమావేశం నిర్వహించిందిఉగ్రవాద దుశ్చర్యలపై నిర్దిష్ట లక్ష్యంతోసమతూకంతోఉద్రిక్తతలకు తావివ్వని రీతిలో ప్రతిస్పందించినట్లు స్పష్టం చేసిందిఈ సందర్భంగా పాకిస్థాన్‌ సైనిక స్థావరాలను తాము లక్ష్యం చేసుకోలేదని నిర్దిష్టంగా వివరించిందిఅయితేభారత్‌లోని సైనిక స్థావరాలపై దాడికి పాల్పడితే దీటైన రీతిలో తిప్పికొట్టడం తథ్యమని పునరుద్ఘాటించిందిఉత్తరపశ్చిమ భారత ప్రాంతాల్లోని అనేక సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ నెల 7వ తేదీ రాత్రి పాకిస్థాన్‌ దాడికి యత్నించిందని పేర్కొందిఈ మేరకు అవంతిపురశ్రీనగర్జమ్ముపఠాన్‌కోట్అమృత్‌సర్కపుర్తలజలంధర్లూథియానాఆదంపూర్భటిండాచండీగఢ్నాల్ఫలోడిఉత్తర్‌లాయ్‌భుజ్‌ సహా అనేక సైనిక లక్ష్యాలపై డ్రోన్‌లుక్షిపణులుప్రయోగించిందని తెలిపిందిఅయితేసమీకృత కౌంటర్‌ ‘యుఎఎస్‌’ గ్రిడ్‌గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో వాటిని మార్గమధ్యంలోనే నేలకూల్చినట్లు వివరించిందిపాకిస్థాన్‌ సదరు దాడులకు పాల్పడిందని నిరూపించే ఆధారాల కోసం అది ప్రయోగించిన ఆయుధ శకలాలను పలు ప్రదేశాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో నేటి ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్థాన్‌లోని అనేక ప్రదేశాల్లో వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలు లక్ష్యంగా దాడి చేశాయిఆ మేరకు పాక్‌ కవ్వింపులకు సముచిత రీతిలో భారత్‌ దీటుగా ప్రతిస్పందించిందితదనుగుణంగా లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని నిర్ధారించిందిమ్ము కాశ్మీర్‌లోని కుప్వారాబారాముల్లారీపూంచ్మెంధార్, రాజౌరి సెక్టార్ల పరిధిలోని ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా పాక్‌ సైనికులు మాత్రం నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లుభారీ ఆయుధ సామగ్రితో కాల్పులు ముమ్మరం చేశారుఈ దుశ్చర్య ఫలితంగా ముగ్గురు మహిళలుఐదుగురు బాలలు సహా 16 మంది అమాయక పౌరులు మరణించారని తెలిపిందిపర్యవసానంగా పాకిస్థాన్‌ను నిలువరించేందుకు తాము కూడా దీటుగా స్పందించక తప్పలేదని భారత్‌ స్పష్టం చేసిందిఉద్రికత్తలకు తావివ్వరాదన్న విధానాన్ని పాకిస్థాన్‌ సైన్యం పాటించినపుడే భారత సాయుధ దళాలు కూడా తమ నిబద్ధతను చాటుకుంటాయని పునరుద్ఘాటించింది.

 

***


(Release ID: 2127755) Visitor Counter : 2