సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత్లో షూటింగ్ కోసం ఏడాదిలోనే ఇండియా సినీ క్లబ్ (ఐసీహెచ్)కు వంద దరఖాస్తులు: పృథుల్ కుమార్, ఎండీ, ఎన్ఎఫ్డీసీ
“రాబోయే రోజుల్లో అనేక విదేశీ చిత్ర నిర్మాణ సంస్థలు భారత్కు రానున్నాయి”: భూమి పెడ్నేకర్
"ప్రముఖ చిత్రాల్లోని అనేక ప్రదేశాలు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా మారాయి": నితిన్ తేజ్ అహుజా, సీఈవో, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా
వేవ్స్ 2025 వేదికగా ‘లైట్స్, కెమెరా, డెస్టినేషన్! సినిమాల ద్వారా భారత బ్రాండింగ్’ అనే అంశంపై ప్యానెల్ చర్చ
Posted On:
02 MAY 2025 10:09PM
|
Location:
PIB Hyderabad
ఈరోజు ముంబయిలో వేవ్స్ 2025 వేదికగా 'లైట్స్, కెమెరా, డెస్టినేషన్! సినిమాల ద్వారా భారత బ్రాండింగ్' అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో నటి భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ “ఇది భారత్ అనుకూల సమయం. ఇది మొత్తం ప్రపంచానికి తెలిసిన విషయం” అని వ్యాఖ్యానించారు.
చర్చలో పాల్గొన్న ఇతర ప్యానెలిస్టుల్లో ఎన్ఎఫ్డీసీ జాయింట్ సెక్రటరీ (ఐ అండ్ బీ), మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పృథుల్ కుమార్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ సీఈవో శ్రీ నితిన్ తేజ్ అహుజా, గుజరాత్ ప్రభుత్వ కార్యదర్శి (పర్యాటక) శ్రీ రాజేందర్ కుమార్, ఐటీడీసీ ఎండీ ముగ్ధా సిన్హా ఉన్నారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియా సినీ హబ్ (ఐసీహెచ్) ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకర్స్, నిర్మాతలు భారత్లో సినిమా షూటింగ్లు నిర్వహించేలా ప్రోత్సహిస్తూ, షూటింగ్ నిర్వహణ ప్రక్రియను సులభతరం చేస్తోందని జాయింట్ సెక్రటరీ (ఐ అండ్ బీ), ఎన్ఎఫ్డీసీ ఎండీ శ్రీ పృథుల్ కుమార్ తెలిపారు. భారత్లో సినిమాల చిత్రీకరణకు ఇది వన్-స్టాప్ గమ్యస్థానంగా ఉందనీ, అలాగే సినిమా షూటింగ్ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఇది వివిధ రాష్ట్రాల పోర్టళ్లతో అనుసంధానం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్లో సినిమాల చిత్రీకరణను సులభతరం చేసే సింగిల్-విండో సౌకర్యంగా, అనుమతుల జారీ యంత్రాగంగా పనిచేస్తుంది. అలాగే సినిమా అనుకూల వ్యవస్థ రూపకల్పనకు ఇది ప్రయత్నిస్తుంది. మన దేశాన్ని సినిమా చిత్రీకరణల గమ్యస్థానంగా ప్రోత్సహిస్తుంది. 2023లో పెరిగిన ప్రోత్సాహకాల కారణంగా వ్యాపారం పది రెట్లు పెరిగింది. భారత్లో షూటింగ్ చేయడం కోసం ఈ పోర్టల్కు ఏడాది కాలంలోనే వందకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రోత్సాహకాలు విదేశీ ఫిల్మ్ మేకర్స్ కోసం భారత్ను ఆకర్షణీయమైన షూటింగ్ ప్రదేశంగా మార్చాయి.
రాబోయే రోజుల్లో అనేక విదేశీ నిర్మాణ సంస్థలు భారత్కు రానున్నాయని భూమి పడ్నేకర్ అన్నారు. "ప్రపంచంలోని అనేక ప్రాంతాల ప్రజలకు మా సినిమా వల్లే ముంబయి గురించి తెలిసింది" అని ఆమె పేర్కొన్నారు. భారత్లోని అనేక ప్రదేశాల్లో షూటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని తెలిపిన భూమి పడ్నేకర్, "నా సినిమాల్లో చాలా వరకు మన సంస్కృతి, మన దేశపు విలువలు కనిపిస్తాయి. మా జాజ్బా... సినిమా పట్ల మాకు గల ప్రేమ, పని పట్ల మా తారాగణం నిబద్ధత సాటిలేనివి" అని ఆమె వ్యాఖ్యానించారు.
భారత చిత్ర పరిశ్రమను గురించి భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ... ఇప్పుడు సినిమా సెట్లలో పనిచేసే పురుషులు, మహిళల సంఖ్య దాదాపు సమానంగా ఉంటోందన్నారు. భారత్లో చిత్ర నిర్మాణంలోకి వస్తున్న ఉన్నత వర్గాల వారు మాత్రమే డబ్బులు సంపాదిస్తున్నారని ఆమె అన్నారు.
నితిన్ తేజ్ అహుజా మాట్లాడుతూ... ప్రముఖ భారతీయ చిత్రాల్లో చూపించిన అనేక ప్రదేశాలు ప్రస్తుతం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా మారాయన్నారు. గుల్మార్గ్లోని 'బాబీ' బంగ్లా, డీడీఎల్జే ద్వారా ప్రసిద్ధి చెందిన పంజాబ్లోని పసుపు ఆవాల పొలాలు, 'జబ్ వి మెట్'లో చూపించిన రాత్లాం నుంచి భటిండా వరకు సాగే రైలు ప్రయాణం, 'త్రీ ఇడియట్స్' చిత్రంలోని సన్నివేశాలను చిత్రీకరించిన పాంగోంగ్ సరస్సు వంటివి దీనికి కొన్ని ఉదాహరణలు. 'దిల్ చాహ్తా హై' విడుదలైనప్పటి నుంచి భారత యువత స్నేహితులతో కలిసి గోవాలో పర్యటించడం మొదలైందని ఆయన పేర్కొన్నారు.
సినిమాల షూటింగ్ కోసం మన సంస్థలను ప్రారంభించడం గురించి దేశం ఆలోచించాలని ఐటీడీసీ ఎండీ ముగ్ధా సిన్హా అభిప్రాయపడ్డారు. దేశంలో సినిమా నిర్మాణ, పర్యాటక రంగాలకు ఇది అత్యంత అనుకూలమైన సమయం అని ఆమె పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వ (పర్యాటక) కార్యదర్శి రాజేందర్ కుమార్ మాట్లాడుతూ.. గుజరాత్లో చిత్రీకరించిన చిత్రాల ద్వారా పర్యాటరంగాన్ని ప్రోత్సహించడానికి వాటి షూటింగ్ జరిగిన ప్రదేశాన్ని క్రెడిట్ లైన్లలో పేర్కొనడం వంటి గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. సానుకూల విధాన నమూనాలు, మంచి మౌలిక సదుపాయాలు, షూటింగ్ కోసం అనుమతుల సౌలభ్యం కారణంగానే ఫిల్మ్ మేకర్స్ తమ రాష్ట్రానికి వస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ సమావేశానికి సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ ఫోరం వ్యవస్థాపకురాలు సుప్రియా సూరి సమన్వయకర్తగా వ్యవహరించారు.
* * *
Release ID:
(Release ID: 2126557)
| Visitor Counter:
9