కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వడగాడ్పుల నుంచి శ్రామికులు, కార్మికుల రక్షణ కోసం తక్షణ చర్యలు


• రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంత అధికారులకు కేంద్రం సూచన

Posted On: 22 APR 2025 5:02PM by PIB Hyderabad

వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులుకార్మికులపై అతి వేడిమితో కూడిన గాలుల ప్రభావం పడకుండా ఆ ప్రభావాన్ని తగ్గించే దిశగా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకుకేంద్రపాలిత ప్రాంతాలకు కార్మికఉపాధి మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది.
ఈ విషయంలో యాజమాన్య సంస్థలునిర్మాణ రంగ కంపెనీలుపరిశ్రమలు తగిన చర్యలను తీసుకొని తీరాలంటూ వాటికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులుకేంద్రపాలిత ప్రాంత అధికారులకు రాసిన ఒక లేఖలో కార్మికఉపాధి శాఖ కార్యదర్శి సూచించారు.
పని వేళల్లో మార్పుచేర్పులు చేయడంపని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయాలను సమృద్ధిగా కల్పించడంగాలి వీచేచల్లదనాన్ని అందించే పరికరాల్ని సమకూర్చడంవిశ్రాంతికంటూ కొన్ని స్థలాల్ని ప్రత్యేకించడంతరచు ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తుండడంభవననిర్మాణ రంగ శ్రామికుల వంటి వర్గాలకు అత్యవసర సందర్భాల్లో ఐస్ ప్యాకులనువేడిగాడ్పుల బారిన పడి అస్వస్థతకు లోనైతే ఉపశమనకారకాలను అందజేయడం సహా వివిధ చొరవలు తీసుకొంటూసమన్వయంతో ముందుకు పోవాలని... ఇలా అనేక సలహాలను ఈ లేఖలో పొందుపరిచారు.
పనులను కొంత నెమ్మదిగా పూర్తి చేయాల్సిందిగానుశ్రామికులకు అనువుగా ఉండేలా నిర్దిష్ట కాల సూచికలను నిర్ధారించాల్సిందిగానువిపరీతమైన వేడిమి ఉండే వేళల్లో ఇద్దరు ఒక జట్టుగా పనిచేసేందుకు వెసులుబాటును ఇవ్వడంభూగర్భ గనులలో గాలి ప్రసరణకు సరైన వ్యవస్థను కల్పించడం వంటి చొరవలు సైతం తీసుకోవాలంటూ గనులుఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఈ లేఖలో కొన్ని మార్గదర్శకాల్ని పేర్కొన్నారుకార్ఖానాలుగనులకు తోడు భవన నిర్మాణ రంగంలోఇటుకల బట్టీల్లో పనులు చేసే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనీనిప్పులు చెరిగే మండుటెండల్లో కార్మికులు తమను తాము కాపాడుకొనే పద్ధతులను తెలుసుకొనేందుకు వీలుగా వారిని ఉద్దేశించి చైతన్య శిబిరాల్ని నిర్వహించడంలేబర్ చౌకుల్లో పోస్టర్ల ద్వారాబ్యానర్ల ద్వారా హెచ్చరికలు చేయడం వంటివాటిని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందని లేఖలో స్పష్టం చేశారు.  

 

***


(Release ID: 2123631) Visitor Counter : 7