ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 22 APR 2025 6:51PM by PIB Hyderabad

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఈరోజు జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘‘ఈ హేయమైన చర్యకు బాధ్యులైన వారిని చట్టం ఎదుట నిలబెడతాంవారిని వదిలిపెట్టబోమువారి దుష్ట ఎజెండా ఎన్నటికీ సఫలం కాదుఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం అచంచలమైనదిఅది మరింత బలపడుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానుఆత్మీయులను కోల్పోయిన వారికి నా సానుభూతి తెలుపుతున్నానుక్షతగాత్రులు అతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుబాధితులకు శక్తివంచన లేకుండా సాయమందిస్తున్నాం.

ఈ హేయమైన చర్యకు బాధ్యులైన వారిని చట్టం ఎదుట నిలబెడతాంవారిని వదిలిపెట్టబోమువారి దుష్ట ఎజెండా ఎన్నటికీ సఫలం కాదుఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం అచంచలమైనదిఅది మరింత బలపడుతుంది.’’ 

 

(రిలీజ్ ఐడి: 2123622) సందర్శకుల సూచీ సంఖ్య : : 115