ప్రధాన మంత్రి కార్యాలయం
మయన్మార్, థాయిలాండ్లలో భూకంపం ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
Posted On:
28 MAR 2025 2:18PM by PIB Hyderabad
మయన్మార్, థాయిలాండ్లలో ఈ రోజు ఉదయం పెను భూకంపం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విపత్తు వల్ల ప్రభావితులైన వారి భద్రత, క్షేమం కోసం ఆయన ప్రార్థించారు. ఈ కఠిన సమయంలో మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలకు, ప్రజలకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన హామీనిచ్చారు.
‘‘ఎక్స్’’లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘నేను మయన్మార్, థాయిలాండ్లలో వచ్చిన భూకంపం పట్ల ఆందోళన చెందుతున్నాను. నేను అందరి భద్రత, క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. భారత్ అన్ని విధాలుగా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో సర్వసన్నద్ధంగా ఉండాల్సిందిగా మా అధికారులకు సూచించాం. మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో మాట్లాడాల్సిందిగా విదేశాంగ శాఖను ఆదేశించాను’’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2116141)
Visitor Counter : 45
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam